అగ్ని ప్రమాదంలో రూ.15 కోట్ల నష్టం!
వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
పెబ్బేరు గోదాంలో కాలిపోయిన ధాన్యం, గోనె సంచులు
పెబ్బేరు, న్యూస్టుడే: వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. గోదాంలో సోమవారం సాయంత్రం పెద్దఎత్తున మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రికి కూడా పూర్తిస్థాయిలో చల్లారలేదు. ఏబీడీ లిక్కర్ కంపెనీకి చెందిన భారీ ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి అగ్నిమాపక వాహనాల ద్వారా సిబ్బంది రాత్రీ పగలూ శ్రమించారు. భారీ యంత్రాలతో గోదాం గోడలను కూల్చివేసి.. కాలిపోయిన గోనె సంచులను బయటకు తీశారు. గోదాంలో మూడు కంపార్ట్మెంట్లు ఉండగా ఒకదానిలో పౌర సరఫరాల శాఖకు చెందిన గోనె సంచులున్నాయి. మిగతా రెండు కంపార్ట్మెంట్లలో మిల్లర్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం నిల్వ చేయగా సుమారు 20 శాతానికి పైగానే కాలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
మొత్తం ధాన్యం విలువ సుమారు రూ.7 కోట్లు కాగా.. ఇందులో రూ.2 కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గోదాంలో పౌరసరఫరాలకు సంబంధించిన దాదాపు 12.85 లక్షల గోనె సంచులు కాలిపోగా.. వీటి విలువ రూ.9.25 కోట్లు. 2018లో రూ.3.75 కోట్లతో నిర్మించిన ఆధునిక వ్యవసాయ గోదాం కూడా ధ్వంసమైంది. వీటితో సహా అగ్ని ప్రమాదంలో మొత్తం రూ.15కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రమాద ఘటనపై హైదరాబాద్కు చెందిన ఫోరెన్సిక్ బృందం వచ్చి పరీక్షించింది. మంటలు పూర్తిగా చల్లారకపోవడంతో సంబంధిత సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. మహబూబ్నగర్ అదనపు ఎస్పీ రాములు, హైదరాబాద్కు చెందిన వ్యవసాయ మార్కెట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తేకార్ నదీమ్, వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఘటన వివరాలను సేకరించారు. మిల్లుల యజమానులను, అక్కడ ఉండే సిబ్బందిని పిలిపించి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి