పెళ్లితో ఒక్కటయ్యారు.. భయంతో తనువు చాలించారు
ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇంట్లో వారికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మైనర్ కావడం, పెద్దలు ఏమంటారోననే భయంతో ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లిలో చోటు చేసుకుంది.
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట
కొందుర్గు, న్యూస్టుడే: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇంట్లో వారికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మైనర్ కావడం, పెద్దలు ఏమంటారోననే భయంతో ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాసిపల్లికి చెందిన కావలి శ్రీకాంత్(24) షాద్నగర్లోని ఓ కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. అతనికి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత నెల 27న పెద్దలకు తెలియకుండా యాదగిరిగుట్టలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం అదే నెల 30న ఉత్తరాసిపల్లిలోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. తరువాత మాట్లాడుదామనే ఉద్దేశంతో పెద్దలు అప్పటికి ఏమీ అనలేదు. అయితే అమ్మాయి మైనర్ అయినందున తమ వివాహాన్ని రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో అదేరోజు రాత్రి గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్దకు వెళ్లి ఇద్దరూ పురుగు మందు తాగారు. గమనించిన శ్రీకాంత్ కుటుంబసభ్యులు వెంటనే వారిని షాద్నగర్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 1న బాలిక, 2న శ్రీకాంత్ మృతిచెందారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు