ముగ్గురి ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. అదనపు కట్నం కావాలని అత్తింటి వారి వేధింపులు.. భర్తతో గొడవలు తాళలేక ఏడాది వయసున్న బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది.
11 నెలల కుమారుడు సహా తల్లి ఆత్మహత్య
మనస్తాపంతో ఆమె తల్లి సైతం బలవన్మరణం
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. అదనపు కట్నం కావాలని అత్తింటి వారి వేధింపులు.. భర్తతో గొడవలు తాళలేక ఏడాది వయసున్న బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మృతితో ఆవేదనకు గురైన ఆమె తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్లో మంగళవారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్కుమార్ కథనం, పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. బొమ్మకల్లోని విజయనగరి కాలనీలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరాచారి, జయప్రద(51)లకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. రెండో కుమార్తె శ్రీజ(27)కు మూడేళ్ల కిందట వరంగల్కు చెందిన ముగ్ధుంపూర్ నరేశ్కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు. నరేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో కుటుంబం హైదరాబాద్లో నివాసముంటోంది.
నరేశ్, శ్రీజలకు 11 నెలల కుమారుడు రేయాన్ష్ అలియాస్ అర్విన్ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు అదనపు కట్నం కావాలని అత్త సుజాత, మామ కేశవాచారి వేధించేవారు. ముగ్గురూ కలిసి మానసికంగా వేధించడంతోపాటు కొట్టి అయిదు రోజుల క్రితం బాబుతో పాటు శ్రీజను పుట్టింటికి పంపారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మంగళవారం ఉదయం అత్తమామలు, భర్త ఫోన్ చేసి.. మరో నెల రోజుల్లో కుమారుడి పుట్టినరోజు వేడుకలపై మాట్లాడారు. ‘పుట్టినరోజు వేడుకలు నువ్వే చేసుకో.. మేము రాము’ అంటూ వారు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీజ తన కుమారుడికి గుర్తుతెలియని మాత్రలు మింగించి, తానూ వేసుకుంది. వారిని ఆమె తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీజకు చికిత్స మొదలుపెట్టారు. కాసేపటికే ఆమె కూడా మృతి చెందింది.
చికిత్స జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్లిన జయప్రద కుమార్తె వేసుకున్న మాత్రల్లో మిగిలినవాటిని వేసుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను పక్కింటివారు గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య, కుమార్తె, మనవడి మృతితో వెంకటేశ్వరాచారి గుండెలు బాదుకొని రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. ఆయన ఫిర్యాదు మేరకు శ్రీజ భర్త నరేశ్, అత్తమామలు సుజాత, కేశవచారిలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్ తెలిపారు. ఆత్మహత్యకు ఉపయోగించిన మాత్రలను శ్రీజ యూట్యూబ్లో వెతికి.. ఆన్లైన్లో తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం