దద్దరిల్లిన దండకారణ్యం.. 12 మంది మావోయిస్టుల మృతి
దండకారణ్య ప్రాంతం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయి. దీని గురించి అందిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
ఛత్తీస్గఢ్లో 10 మంది.. మధ్యప్రదేశ్లో ఇంకో ఇద్దరు
దుమ్ముగూడెం - న్యూస్టుడే
దండకారణ్య ప్రాంతం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయి. దీని గురించి అందిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మధ్యప్రదేశ్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు పలు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి నుంచి బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు సంయుక్తంగా లేంద్రా, కోర్చోలీ, సావనార్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కోర్చోలీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోయిస్టు దళాలు కాల్పులు జరపడంతో.. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య దాదాపు 3 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారి కోసం బలగాలు గాలింపు చేపట్టగా.. మరో ఆరు మృతదేహాలు లభించాయి. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకొని పారిపోయి ఉంటారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటన స్థలంలో బ్యారల్ గ్రెనేడ్ లాంచర్, ఎల్ఎంజీ, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గంగలూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. మావోయిస్టులు ఏటా వేసవిలో మార్చి నుంచి జూన్ మధ్య టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్(టీసీవోసీ) నిర్వహించి.. తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ విలేకరులకు తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ నియోజకవర్గం పరిధిలో భద్రతా బలగాలపై పెద్దఎత్తున దాడులకు వ్యూహం రూపొందించారని పేర్కొన్నారు. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 43 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించారు. బస్తర్ లోక్సభ నియోజకవర్గానికి ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్లో..
ఛత్తీస్గఢ్-మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా కేరజారి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యురాలు(డీసీఎం) సజంతి అలియాస్ క్రాంతి(35), ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) రఘు అలియాస్ షేర్సింగ్(40) ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47, 12-బోర్ రైఫిల్, కిట్ బ్యాగులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనను బాలాఘాట్ ఎస్పీ సమీర్ సౌరబ్ ధ్రువీకరించారు. సజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!