తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
‘అమ్మా.. నాన్నకి ఫోన్ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన పడింది.
మృతుడు విజయనగరం జిల్లా వాసి
విశాఖపట్నం (గురుద్వారా), న్యూస్టుడే: ‘అమ్మా.. నాన్నకి ఫోన్ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన పడింది. డ్యూటీ నుంచి నాన్న వచ్చే సమయం కావడంతో అమాయకంగా ఎదురుచూస్తున్న పిల్లలకు ఇక ఎప్పటికీ రారనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశా గ్రామానికి చెందిన పాలవలస శంకర్రావ్(37) 2010లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం విశాఖపట్నం ద్వారకానగర్లోని ఓ బ్యాంకు శాఖలో కాపలాదారుగా పనిచేస్తున్నారు.
భార్య శ్రావణికుమారి(30), కుమారుడు కిశోర్ చంద్రదేవ్(5), కుమార్తె(2)తో కలిసి శివాజీపాలెంలో నివసిస్తున్నారు. శంకర్రావ్ గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. సుమారు 6 గంటల ప్రాంతంలో పనిచేస్తున్న చోటే కూర్చొని తుపాకీని గుండె వైపు పెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడున్న సిబ్బంది ఆ సమాచారాన్ని ద్వారకా పోలీసులకు అందించారు. ఏసీపీ రాంబాబు, సీఐ రమేశ్, ఎస్.ఐ ధర్మేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఆత్మహత్య ఘటన దృశ్యాల్ని చూశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఏసీపీ రాంబాబు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్