పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య
పాలల్లో విషం కలిపి తాగించి లోకం తెలియని కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన దంపతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు.
34 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో మృతదేహాల గుర్తింపు
గార్ల, న్యూస్టుడే: పాలల్లో విషం కలిపి తాగించి లోకం తెలియని కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన దంపతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. 34 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన పి.అనిల్ (26), దేవి (22) దంపతులకు లోహిత(3), జశ్విత(1) కుమార్తెలు. దంపతులిద్దరూ కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. మరోవైపు మూడోసారి గర్భం దాల్చిన దేవికి అనారోగ్య సమస్యలతో గర్భస్రావం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల 10వ తేదీ రాత్రి దంపతులిద్దరూ కుమార్తెలకు పాలల్లో విషం కలిపి తాగించారు. పిల్లలు మృతిచెందారని నిర్ధారించుకున్నాక ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అప్పట్నుంచి అటు పోలీసులు, ఇటు బంధువులు వారి కోసం గాలిస్తూ వస్తున్నారు. అనిల్ ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని గత నెల 23న బయ్యారం మండలం నామాలపాడు వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వాహనం దొరికిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఇరువురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం గుర్తించారు. ‘పిల్లలను కడతేర్చి..తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక సమస్యలు, దేవి అనారోగ్యమే కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్