అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం
మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది.
రహదారికి పక్కగా ఉన్నవారిపై నుంచి దూసుకుపోయిన వైనం
బాలుడి దుర్మరణం.. 10 మందికి గాయాలు
అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్టుడే: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది. రహదారికి పక్కగా ఉన్నవారి పైనుంచి దూసుకుపోయి పన్నెండేళ్ల బాలుడిని బలితీసుకోగా, పది మందిని గాయపరిచింది. 4 ద్విచక్ర వాహనాలను, ఒక కారును, సంచార అల్పాహార వాహనాన్ని ధ్వంసం చేసింది. కశింకోట సీఐ వినోద్బాబు కథనం ప్రకారం.. పెందుర్తికి చెందిన ముస్లింలు కుటుంబసభ్యులతో కలసి కారులో పిఠాపురం వెళ్తున్నారు. జాతీయరహదారికి పక్కగా ఉన్న అల్పాహార వాహనం వద్ద ఆగారు. ఈ సమయంలో అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళ్తున్న అవంతి కళాశాల బస్సు వీరి మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో షేక్ గౌస్ ముదీనా (12) మృతిచెందాడు. ఇతని తల్లి మున్నీ, తండ్రి రెహమాన్, షేక్ షరీబా, సయ్యద్ బాబ్జీ, అలీ హస్సేన్, ఎస్.రామకృష్ణలకు గాయాలయ్యాయి. వీరిలో మున్నీ, రామకృష్ణలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మిగిలిన వారికి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రహదారి పక్కన ఫలహారం తింటున్న గొన్నాబత్తుల లక్ష్మి, కరణం లక్ష్మణరావు, గొల్లవిల్లి రమణమ్మ, కర్రి అనిల్కుమార్లకు గాయలవ్వగా వీరిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్ వేగంతో పాటు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కుమార్తెకు వివాహం ఖరారు కావడంతో..
పెందుర్తికి చెందిన రెహమాన్ మాంసం దుకాణం నిర్వహిస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె బషీరాకు ఈ నెల 26న వివాహం ఉండటంతో కుటుంబసభ్యులతో కలసి దర్గాలో పూజలు చేసి పిఠాపురంలోని బషీరమ్మ దర్శనానికి కారులో బయలుదేరారు. ఫలహారం కోసం ఆగిన సమయంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అనకాపల్లి లోక్సభ ఉమ్మడి భాజపా అభ్యర్థి సీఎం రమేశ్, అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజు పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు