అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం
మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది.
రహదారికి పక్కగా ఉన్నవారిపై నుంచి దూసుకుపోయిన వైనం
బాలుడి దుర్మరణం.. 10 మందికి గాయాలు
అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్టుడే: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాల బస్సు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం దాటాక జాతీయరహదారిపై శుక్రవారం బీభత్సం సృష్టించింది. రహదారికి పక్కగా ఉన్నవారి పైనుంచి దూసుకుపోయి పన్నెండేళ్ల బాలుడిని బలితీసుకోగా, పది మందిని గాయపరిచింది. 4 ద్విచక్ర వాహనాలను, ఒక కారును, సంచార అల్పాహార వాహనాన్ని ధ్వంసం చేసింది. కశింకోట సీఐ వినోద్బాబు కథనం ప్రకారం.. పెందుర్తికి చెందిన ముస్లింలు కుటుంబసభ్యులతో కలసి కారులో పిఠాపురం వెళ్తున్నారు. జాతీయరహదారికి పక్కగా ఉన్న అల్పాహార వాహనం వద్ద ఆగారు. ఈ సమయంలో అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళ్తున్న అవంతి కళాశాల బస్సు వీరి మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో షేక్ గౌస్ ముదీనా (12) మృతిచెందాడు. ఇతని తల్లి మున్నీ, తండ్రి రెహమాన్, షేక్ షరీబా, సయ్యద్ బాబ్జీ, అలీ హస్సేన్, ఎస్.రామకృష్ణలకు గాయాలయ్యాయి. వీరిలో మున్నీ, రామకృష్ణలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మిగిలిన వారికి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రహదారి పక్కన ఫలహారం తింటున్న గొన్నాబత్తుల లక్ష్మి, కరణం లక్ష్మణరావు, గొల్లవిల్లి రమణమ్మ, కర్రి అనిల్కుమార్లకు గాయలవ్వగా వీరిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్ వేగంతో పాటు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కుమార్తెకు వివాహం ఖరారు కావడంతో..
పెందుర్తికి చెందిన రెహమాన్ మాంసం దుకాణం నిర్వహిస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె బషీరాకు ఈ నెల 26న వివాహం ఉండటంతో కుటుంబసభ్యులతో కలసి దర్గాలో పూజలు చేసి పిఠాపురంలోని బషీరమ్మ దర్శనానికి కారులో బయలుదేరారు. ఫలహారం కోసం ఆగిన సమయంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అనకాపల్లి లోక్సభ ఉమ్మడి భాజపా అభ్యర్థి సీఎం రమేశ్, అనకాపల్లి అసెంబ్లీ ఉమ్మడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజు పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
కావేరి నదిలో ఈతకు దిగిన విద్యార్థులు ఐదుగురు మృత్యువాతపడిన ఘటన కర్ణాటకలో విషాదం రేపింది. -
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్