మేఘా ఇంజినీరింగ్ సంస్థపై సీబీఐ కేసు
ఛత్తీస్గఢ్లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై రాయ్పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎన్ఐఎస్పీ ప్రాజెక్టు పనుల్లో లంచం ఇచ్చారని అభియోగం
ఈనాడు, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై రాయ్పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితుల జాబితాలో 12వ స్థానంలో మేఘా సంస్థను చేర్చింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలోని మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదైంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా నాగర్నార్లోని ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ (ఎన్ఐఎస్పీ) ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా లంచమిచ్చిందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్ఎండీసీ విశ్రాంత ఈడీ ప్రశాంత్ దశ్, జీఎం(ఫైనాన్స్) రాజశేఖర్, మేనేజర్(ఫైనాన్స్) సోమ్నాథ్ ఘోష్, ఎన్ఐఎస్పీ డైరెక్టర్(ప్రొడక్షన్) దిలీప్కుమార్ మొహంతి, డీజీఎం ప్రదీప్కుమార్ భూయాన్, డిప్యూటీ మేనేజర్ నరేశ్బాబు, సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ, సీజీఎం కృష్ణమోహన్, మెకాన్ సంస్థ విశ్రాంత ఏజీఎం(కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, విశ్రాంత డీజీఎం(కాంట్రాక్ట్స్) ఇలవరుసు, మేఘా జీఎం సుభాష్చంద్ర సంగ్రాస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై ఈ కేసు నమోదు చేశారు.
ప్రాజెక్టుకు సంబంధించి ఇన్టేక్వెల్, పంప్హౌస్, తాగునీటి శుద్ధి ప్లాంటు, క్రాస్కంట్రీ పైప్లైన్ నిర్మాణ పనులతోపాటు ఐదేళ్ల నిర్వహణ కోసం 2015లో రూ.314.57కోట్ల విలువైన కాంట్రాక్టును ఎన్ఎండీసీ... ఎంఈఐఎల్, కోయా అండ్ కంపెనీ కన్స్ట్రక్షన్ లిమిటెడ్(కేసీసీఎల్)తో కూడిన కన్సార్షియంకు అప్పగించింది. కాంట్రాక్టులో భాగంగా 2018 డిసెంబరు నాటికి 73 ఇన్వాయిస్ల ద్వారా ఎంఈఐఎల్కు రూ.174.41కోట్లను చెల్లించారు. ఈ ఇన్వాయిస్లను ప్రాసెస్ చేసినందుకు ఎన్ఎండీసీ అధికారులకు రూ.73.85లక్షలు.. అందులో భాగమైన మెకాన్ అధికారులకు రూ.5.01లక్షలు లంచంగా ఇచ్చారనేది అభియోగం. ఈ వ్యవహారంపై ఎన్ఎండీసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా విచారణ జరిపి 2023లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31న సీబీఐ కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!