మేఘా ఇంజినీరింగ్ సంస్థపై సీబీఐ కేసు
ఛత్తీస్గఢ్లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై రాయ్పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎన్ఐఎస్పీ ప్రాజెక్టు పనుల్లో లంచం ఇచ్చారని అభియోగం
ఈనాడు, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై రాయ్పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితుల జాబితాలో 12వ స్థానంలో మేఘా సంస్థను చేర్చింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలోని మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదైంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా నాగర్నార్లోని ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ (ఎన్ఐఎస్పీ) ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా లంచమిచ్చిందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్ఎండీసీ విశ్రాంత ఈడీ ప్రశాంత్ దశ్, జీఎం(ఫైనాన్స్) రాజశేఖర్, మేనేజర్(ఫైనాన్స్) సోమ్నాథ్ ఘోష్, ఎన్ఐఎస్పీ డైరెక్టర్(ప్రొడక్షన్) దిలీప్కుమార్ మొహంతి, డీజీఎం ప్రదీప్కుమార్ భూయాన్, డిప్యూటీ మేనేజర్ నరేశ్బాబు, సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ, సీజీఎం కృష్ణమోహన్, మెకాన్ సంస్థ విశ్రాంత ఏజీఎం(కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, విశ్రాంత డీజీఎం(కాంట్రాక్ట్స్) ఇలవరుసు, మేఘా జీఎం సుభాష్చంద్ర సంగ్రాస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై ఈ కేసు నమోదు చేశారు.
ప్రాజెక్టుకు సంబంధించి ఇన్టేక్వెల్, పంప్హౌస్, తాగునీటి శుద్ధి ప్లాంటు, క్రాస్కంట్రీ పైప్లైన్ నిర్మాణ పనులతోపాటు ఐదేళ్ల నిర్వహణ కోసం 2015లో రూ.314.57కోట్ల విలువైన కాంట్రాక్టును ఎన్ఎండీసీ... ఎంఈఐఎల్, కోయా అండ్ కంపెనీ కన్స్ట్రక్షన్ లిమిటెడ్(కేసీసీఎల్)తో కూడిన కన్సార్షియంకు అప్పగించింది. కాంట్రాక్టులో భాగంగా 2018 డిసెంబరు నాటికి 73 ఇన్వాయిస్ల ద్వారా ఎంఈఐఎల్కు రూ.174.41కోట్లను చెల్లించారు. ఈ ఇన్వాయిస్లను ప్రాసెస్ చేసినందుకు ఎన్ఎండీసీ అధికారులకు రూ.73.85లక్షలు.. అందులో భాగమైన మెకాన్ అధికారులకు రూ.5.01లక్షలు లంచంగా ఇచ్చారనేది అభియోగం. ఈ వ్యవహారంపై ఎన్ఎండీసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా విచారణ జరిపి 2023లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31న సీబీఐ కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.