బెదిరిస్తారు.. దోచేస్తారు!
హైదరాబాద్లోని ఒక ప్రఖ్యాత విద్యాసంస్థలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మహిళకు ముంబయి నుంచి ఫోన్ వచ్చింది. ‘కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో తైవాన్కు ఒక పార్సిల్ వెళుతోంది. అందులో కొన్ని పాస్పోర్టులు, మత్తుమందులు ఉన్నాయని తేలింది.
సైబర్ నేరగాళ్ల నయా పంథా
పార్సిళ్లు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటూ మోసాలు
డబ్బులివ్వకపోతే కేసులు ఎదుర్కోవాలంటూ వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లోని ఒక ప్రఖ్యాత విద్యాసంస్థలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మహిళకు ముంబయి నుంచి ఫోన్ వచ్చింది. ‘కొరియర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో తైవాన్కు ఒక పార్సిల్ వెళుతోంది. అందులో కొన్ని పాస్పోర్టులు, మత్తుమందులు ఉన్నాయని తేలింది. ముంబయి క్రైంబ్రాంచి ఈ కేసు దర్యాప్తు చేస్తోంది’ అని ఆగంతకుడు చెప్పాడు. సంప్రదించాలంటూ ముంబయి క్రైంబ్రాంచి డీసీపీ పేరిట ఓ నంబర్ కూడా ఇచ్చాడు. దీంతో భయపడిన ప్రొఫెసర్ ఆ నంబరుకు ఫోన్ చేశారు. డీసీపీగా చెప్పుకొన్న ఆ వ్యక్తి ప్రొఫెసర్కు అంతర్జాతీయ హవాలా వ్యాపారులతో సంబంధాలున్నాయని బెదిరించి, ఆమె ఖాతా నుంచి రూ.36.7 లక్షలు లూటీ చేశాడు. ఆలస్యంగా మోసం గ్రహించిన ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- మాదాపూర్లో ఓ ఐటీ ఉద్యోగినికి ముంబయి కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ ఆధార్కార్డు ఇతర వివరాలున్న పార్సిల్ చైనా నుంచి వచ్చింది. అందులో కొకైన్ ఉంది’ అని చెప్పాడు. భయపడిన ఆ యువతి కేసు నమోదవకుండా చూడాలంటూ బతిమలాడింది. దీంతో ఆమెను కేసు నుంచి తప్పిస్తానని మాయమాటలు చెప్పిన నేరగాడు ఒకేరోజు రూ.19.5 లక్షలు కాజేశాడు.
- సైబర్ నేరగాళ్ల నయా పంథా ఇది. మాయమాటలు చెప్పి.. బెదిరించి.. పెద్దఎత్తున దోచేస్తున్న ఉదంతాలెన్నో ఇటీవల బయటపడుతున్నాయి. నేరగాళ్లు సీబీఐ, ఈడీ, కస్టమ్స్ వంటి పేర్లు చెప్పి సామాన్యులను హడలెత్తిస్తున్నారు. ఒకప్పుడు లాటరీ వచ్చిందనో.. మరేదో ఆశపెట్టి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు భయపెట్టి లూటీ చేయడం మొదలుపెట్టారు. ఎదుటివారు ఆలోచించేందుకు సమయం ఇవ్వకుండా చాకచక్యంగా బోల్తా కొట్టిస్తున్నారు. సీబీఐ కేసు నమోదయిందని, మత్తుమందుల పార్సిల్ వచ్చిందని రకరకాలుగా బెదిరిస్తున్నారు. తర్వాత ఇలాంటి కేసుల నుంచి బయటపడాలంటే డబ్బు కట్టాలంటా బెదిరించి దోచేస్తున్నారు. ‘ఆశపడి మోసపోవద్దు..’ అంటూ పోలీసులు సాగించిన ప్రచారం సత్ఫలితాన్ని ఇస్తుందని సంతోషిస్తున్న తరుణంలో కొత్తగా మొదలైన ఈ తరహా సైబర్ మోసాలు పరిస్థితిని మళ్లీ దిగజారుస్తున్నాయి. ప్రజల్లో భావోద్వేగాలే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. ఇంటర్నెట్, సెల్ఫోన్ వినియోగం విస్తృతమైన నేపథ్యంలో ఈ తరహా మోసాలు పరాకాష్ఠకు చేరాయి. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా బలవుతోంది ఉన్నత విద్యావంతులు, ఉన్నతోద్యోగులే కావడం గమనార్హం. మోసగాళ్ల నుంచి కాల్స్ రాగానే ముందూవెనుకా ఆలోచించకుండా వారి ఉచ్చులో పడుతున్నారు. ఒకవేళ పోలీసు కేసయితే పరువు పోతుందన్న భయం కూడా వారికే ఎక్కువ ఉంటుందని, అందుకే నేరగాళ్లు ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
నమ్మొద్దు.. భయపడొద్దు!
‘ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దు. కొద్దిగా మీ వ్యక్తిగత వివరాలు చెప్పగానే నిజమని భావించొద్దు. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో చాలామంది వ్యక్తిగత వివరాలు సేకరించి పెట్టుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. పార్సిళ్లు, కొరియర్లు వంటివాటి గురించి చెబితే వెంటనే బెదిరిపోవద్దు. ఒకవేళ ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి’ అని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు