పెట్రోలు పోసి.. మంటల్లోకి తోసి
ఖాళీ స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు విశాఖలో ఒంటరి మహిళపై వైకాపా నాయకుడు పెట్రోలు పోసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు.
స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు.. ఒంటరి మహిళపై వైకాపా నాయకుడి హత్యాయత్నం
విశాఖపట్నం (గాజువాక), న్యూస్టుడే: ఖాళీ స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు విశాఖలో ఒంటరి మహిళపై వైకాపా నాయకుడు పెట్రోలు పోసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు, న్యూపోర్టు పోలీస్స్టేషన్ సీఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 65వ వార్డు భానోజీతోట ప్రాంతానికి చెందిన జలుమూరి రాధ(41)ను వార్డు వైకాపా అధ్యక్షుడు ఎం.లోకనాథం తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కొత్తగా ఇంటి పట్టా ఇప్పిస్తానని పలుమార్లు ఆమె దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా రాధ ఇంటి సమీపంలో ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. బాధితురాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం లోకనాథం తన కుటుంబ సభ్యులతో కలిసి సంబంధిత ఖాళీ స్థలాన్ని చదును చేసి, అక్కడి వ్యర్థాలకు నిప్పుపెట్టాడు. ఆక్రమణపై మరోసారి రాధ ప్రశ్నించడంతో.. తీవ్రంగా ఆగ్రహించిన లోకనాథం ఆమెపై పెట్రోలు పోసి, మంటల్లోకి తోసేశాడు. ముఖం, చేతులపై తీవ్ర గాయాలైన బాధితురాలిని స్థానికులు కింగ్జార్జి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకనాథం, ఆయన కుటుంబ సభ్యులు శ్యామలారావు, శకుంతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!