పరీక్షలకు అనుమతించలేదని... ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం
పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది.
ముథోల్(బాసర), న్యూస్టుడే: పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లా తొగుట మండలం, బండారుపల్లికి చెందిన విద్యార్థి (17) ప్రస్తుతం పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకు ఇంటికెళ్లి ఈ నెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. పీయూసీ పరీక్షలు రాయడానికి కనీస హాజరు 75 శాతం. అతనికి 45 శాతమే ఉండటంతో పరీక్షకు అనుమతించబోమని సోమవారం విశ్వవిద్యాలయం అధికారులు సమాచారమిచ్చారు. ఈ విషయం అతని తల్లిదండ్రులకూ చెప్పారు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లాలని వారికి సూచించారు.
తల్లిదండ్రులను రావద్దని చెప్పి...
విద్యార్థి సోమవారం రాత్రి తండ్రికి ఫోన్ చేశాడు. ‘మీరు రావాల్సిన అవసరం లేదని, జరిమానా చెల్లిస్తే పరీక్షకు అనుమతిస్తామన్నారని’ చెప్పాడు. దాన్ని నమ్మిన తండ్రి కుమారుడి ఫోన్పేకు రూ.2,000 పంపించి సమస్య పరిష్కారమైందని భావించారు. మంగళవారం ఉదయం సహచర విద్యార్థులంతా తరగతులకు వెళ్లగా.. ఇతను మాత్రం గదిలోనే ఉండిపోయాడు. తరగతులు పూర్తయ్యాక హాస్టల్కు వచ్చిన విద్యార్థులు ఉరి వేసుకున్న స్థితిలో స్నేహితుడు కనిపించడంతో అధ్యాపకులకు సమాచారమిచ్చారు. వారు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు: నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్