విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం
జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది.
విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్టుడే: జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. విశాఖ పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు అందించిన వివరాలిలా.. నిరుపేదలైన భార్యాభర్తలు నగరంలో ఉంటూ కుమార్తెను పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ చదివిస్తున్నారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆమెకు ఈ నెల 19 నుంచి పరీక్షలు ఉండటంతో హాల్టికెట్ కోసం ఇటీవల కళాశాలకు వెళ్లింది. రూ.25వేల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే ఇస్తామని చెప్పారు. విద్యార్థినికి నెలరోజుల కిందటే జగనన్న విద్యాదీవెన నగదు జమకావాల్సి ఉంది. జాప్యానికి కారణమేంటని విద్యాశాఖాధికారులను అడగ్గా.. కోడ్ వల్ల నిధులు రాలేదని చెబుతున్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మంగళవారం కుమార్తెను తీసుకుని తల్లి కళాశాలకు వచ్చింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా నగదు చెల్లిస్తానని, హాల్టికెట్ ఇవ్వాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి కళాశాల వరండాలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ క్రమంలో సంబంధిత విద్యార్థిని 100కు కాల్ చేయడంతో పీఎంపాలెం పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. రెండు వారాల్లో రూ.12వేలు చెల్లిస్తానని ఆమె నుంచి హామీపత్రం తీసుకుని విద్యార్థినికి హాల్టికెట్ అందించారు. జగనన్న విద్యాదీవెన డబ్బులు సమయానికొస్తే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని బాధితురాలు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. -
సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్ను సరకు రవాణా వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. -
సీఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్ప్లే పిక్చర్)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. -
రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. -
వివాహితపై యువకుడి అత్యాచారం
ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటంలో ఆదివారం రాత్రి జరిగింది. -
గుజరాత్ తీరంలో రూ.60 కోట్ల విలువైన హషిష్ స్వాధీనం
గుజరాత్ తీరంలో అధికారులు ఓ పడవలో రూ.60 కోట్ల విలువైన 173 కి.గ్రాముల హషిష్ను స్వాధీనం చేసున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద