విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం
జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది.
విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్టుడే: జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. విశాఖ పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు అందించిన వివరాలిలా.. నిరుపేదలైన భార్యాభర్తలు నగరంలో ఉంటూ కుమార్తెను పీఎంపాలెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ చదివిస్తున్నారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆమెకు ఈ నెల 19 నుంచి పరీక్షలు ఉండటంతో హాల్టికెట్ కోసం ఇటీవల కళాశాలకు వెళ్లింది. రూ.25వేల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే ఇస్తామని చెప్పారు. విద్యార్థినికి నెలరోజుల కిందటే జగనన్న విద్యాదీవెన నగదు జమకావాల్సి ఉంది. జాప్యానికి కారణమేంటని విద్యాశాఖాధికారులను అడగ్గా.. కోడ్ వల్ల నిధులు రాలేదని చెబుతున్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మంగళవారం కుమార్తెను తీసుకుని తల్లి కళాశాలకు వచ్చింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా నగదు చెల్లిస్తానని, హాల్టికెట్ ఇవ్వాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి కళాశాల వరండాలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ క్రమంలో సంబంధిత విద్యార్థిని 100కు కాల్ చేయడంతో పీఎంపాలెం పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. రెండు వారాల్లో రూ.12వేలు చెల్లిస్తానని ఆమె నుంచి హామీపత్రం తీసుకుని విద్యార్థినికి హాల్టికెట్ అందించారు. జగనన్న విద్యాదీవెన డబ్బులు సమయానికొస్తే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని బాధితురాలు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం