అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలు
పాల్వంచ, భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణానికి చెందిన కాంపెల్లి కనకేశ్వరరావు 817/41 సర్వే నంబరులోని మూడు ప్లాట్లలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు రూ.3 వేలు చెల్లించారు. అయితే రూ.30 వేలు లంచం ఇస్తేనే లేఅవుట్ అప్రూవ్ చేస్తామని పట్టణ ప్రణాళిక విభాగం సూపర్వైజర్(టీపీఎస్) లక్కిరెడ్డి వెంకటరమణి, ఆ విభాగం ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెరబత్తుల ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు అంగీకరించారు. దీంతో కనకేశ్వరరావు అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచనతో వెంకటరమణి, ప్రసన్నకుమార్లకు రూ.15 వేలు ఇస్తుండగా డీఎస్పీ రమేశ్, సీఐలు శేఖర్, సునీల్, రామారావుతో కూడిన అనిశా బృందం దాడి చేసి ఉద్యోగులిద్దరినీ పట్టుకుంది.
భద్రాచలం పట్టణానికి చెందిన సాయితేజ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 12న స్థానికంగా ఓ దుకాణంలో 4 పంచదార బస్తాలు చోరీ చేశారు. వీటిని ఆటోలో తరలిస్తుండగా బ్లూకోల్ట్స్ పోలీసులు పట్టుకొని పట్టణ ఠాణాకు తరలించారు. అదేరోజు యువకులను వదిలేసి, బస్తాలను దుకాణ యజమానికి అప్పగించారు. ఆటో, సెల్ఫోన్లు మాత్రం ఇవ్వలేదు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, సీసీ కెమెరాల ప్రైవేటు టెక్నీషియన్ నవీన్కుమార్ ఆ యువకులను డిమాండ్ చేశారు. దీంతో వారు అనిశా అధికారులను సంప్రదించారు. వారి సూచనతో సాయితేజ కానిస్టేబుల్ శంకర్కు ఠాణా ప్రాంగణంలో రూ.20 వేలు అందజేశారు. అనంతరం కానిస్టేబుల్ నుంచి సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకొని సాయితేజకు ఆటో తాళాలు, సెల్ఫోన్లు ఇస్తుండగా డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. శ్రీనివాస్, శంకర్, నవీన్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు అనిశా సీఐలు మహేశ్, శ్యాంసుందర్, రాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట