ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంట్రీ క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంట్రీక్లబ్ గ్రూప్ నిర్వాహకులు వై.రాజీవ్రెడ్డి, డి.కృష్ణకుమార్రాజులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 406, 420, రెడ్విత్ 120బీ ఐపీసీ, 5 టీఎస్పీడీఎఫ్ఈఏ (తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. 2001లో శ్రీనివాస్ చౌదరి కుటుంబం రూ.25 వేలు చెల్లించి క్లబ్ సిల్వర్ ప్రివిలేజ్ మనీబ్యాక్ స్కీమ్లో చేరింది. గడువు ముగిసినా.. ఆర్థిక పరిమితుల పేరిట డబ్బుల్ని తిరిగి చెల్లించలేమని, బదులుగా ప్లాట్ ఇస్తామంటూ నిర్వాహకులు ప్రతిపాదించారు. అందుకోసం 2006లో అదనంగా రూ.1.3 లక్షలు తీసుకున్నా ప్లాట్ ఇవ్వలేదు. పలుమార్లు ఒత్తిడి చేయగా చివరకు 2015లో కంట్రీ కుటీరం (ప్రస్తుతం తపోవనం వెంచర్)లో 3 ప్లాట్లను కేటాయించి డెవలప్మెంట్ ఛార్జీల పేరిట రూ.40 వేలు వసూలు చేశారు. ఏళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. చాలాసార్లు ఒత్తిడి తీసుకురాగా 2023లో ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాలు సమకూర్చలేకపోయారు. అంతేకాకుండా గత ఏడాది జనవరిలో తప్పుడు పత్రాలతో తపోవనం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటుచేశారు. క్లబ్ ఉద్యోగులనే సభ్యులుగా నియమించారు. ప్లాట్ యజమానుల నుంచి అదనపు ఛార్జీలను వసూలుచేసే లక్ష్యంతో ఇలాచేశారు. సొసైటీస్ రిజిస్ట్రార్ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా.. ప్లాట్ యజమానులు లీగల్నోటీస్ పంపినా లెక్కచేయకుండా ఉద్యోగుల ద్వారా ప్లాట్లను అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలకు తెరలేపారు. ఆ అసోసియేషన్లో చేరాలంటూ ప్లాట్ యజమానులపై ఒత్తిడి పెంచారు. మరోవైపు లక్కీడ్రా ఆఫర్ను తెరపైకి తీసుకురావడమే కాకుండా మరో వెంచర్లో హౌస్ ప్లాట్తోపాటు ఫ్రీ లైఫ్ క్లబ్ మెంబర్షిప్ పొందొచ్చని ఆశచూపి ఒక్కో యజమాని నుంచి రూ.65 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్, డెవలప్మెంట్ రుసుం కింద అదనంగా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకున్నారు. మరోవైపు క్లబ్ చేపట్టిన పలు వెంచర్లు నిబంధనల మేరకు లేవని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ఏళ్లతరబడి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట