ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంట్రీ క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంట్రీక్లబ్ గ్రూప్ నిర్వాహకులు వై.రాజీవ్రెడ్డి, డి.కృష్ణకుమార్రాజులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 406, 420, రెడ్విత్ 120బీ ఐపీసీ, 5 టీఎస్పీడీఎఫ్ఈఏ (తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. 2001లో శ్రీనివాస్ చౌదరి కుటుంబం రూ.25 వేలు చెల్లించి క్లబ్ సిల్వర్ ప్రివిలేజ్ మనీబ్యాక్ స్కీమ్లో చేరింది. గడువు ముగిసినా.. ఆర్థిక పరిమితుల పేరిట డబ్బుల్ని తిరిగి చెల్లించలేమని, బదులుగా ప్లాట్ ఇస్తామంటూ నిర్వాహకులు ప్రతిపాదించారు. అందుకోసం 2006లో అదనంగా రూ.1.3 లక్షలు తీసుకున్నా ప్లాట్ ఇవ్వలేదు. పలుమార్లు ఒత్తిడి చేయగా చివరకు 2015లో కంట్రీ కుటీరం (ప్రస్తుతం తపోవనం వెంచర్)లో 3 ప్లాట్లను కేటాయించి డెవలప్మెంట్ ఛార్జీల పేరిట రూ.40 వేలు వసూలు చేశారు. ఏళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. చాలాసార్లు ఒత్తిడి తీసుకురాగా 2023లో ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు సౌకర్యాలు సమకూర్చలేకపోయారు. అంతేకాకుండా గత ఏడాది జనవరిలో తప్పుడు పత్రాలతో తపోవనం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటుచేశారు. క్లబ్ ఉద్యోగులనే సభ్యులుగా నియమించారు. ప్లాట్ యజమానుల నుంచి అదనపు ఛార్జీలను వసూలుచేసే లక్ష్యంతో ఇలాచేశారు. సొసైటీస్ రిజిస్ట్రార్ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా.. ప్లాట్ యజమానులు లీగల్నోటీస్ పంపినా లెక్కచేయకుండా ఉద్యోగుల ద్వారా ప్లాట్లను అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలకు తెరలేపారు. ఆ అసోసియేషన్లో చేరాలంటూ ప్లాట్ యజమానులపై ఒత్తిడి పెంచారు. మరోవైపు లక్కీడ్రా ఆఫర్ను తెరపైకి తీసుకురావడమే కాకుండా మరో వెంచర్లో హౌస్ ప్లాట్తోపాటు ఫ్రీ లైఫ్ క్లబ్ మెంబర్షిప్ పొందొచ్చని ఆశచూపి ఒక్కో యజమాని నుంచి రూ.65 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్, డెవలప్మెంట్ రుసుం కింద అదనంగా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకున్నారు. మరోవైపు క్లబ్ చేపట్టిన పలు వెంచర్లు నిబంధనల మేరకు లేవని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ఏళ్లతరబడి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్