రూ.1.5 కోట్ల విలువైన నల్లమందు స్వాధీనం
భారీ ఎత్తున నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేసి రూ.1.5 కోట్ల విలువ చేసే 160 కిలోల నల్లమందు గడ్డి, ఓ వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ధూల్పేట, నారాయణగూడ ఆబ్కారీ ఠాణా పరిధుల్లో పట్టివేత
ధూల్పేట, న్యూస్టుడే: భారీ ఎత్తున నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేసి రూ.1.5 కోట్ల విలువ చేసే 160 కిలోల నల్లమందు గడ్డి, ఓ వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాఖ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ సూపరింటెండెంట్ సీహెచ్ విజయ్, సికింద్రాబాద్ ఈఎస్ పవన్కుమార్, ఏఈఎస్ శ్రీనివాస్, ధూల్పేట ఎస్హెచ్వో మధుబాబుతో కలిసి శనివారం ధూల్పేట ఆబ్కారీ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. 15 రోజులుగా ధూల్పేట, నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్ల పరిధుల్లో నిఘా ఉంచి నల్లమందు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. నల్లమందును రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకొని హైదరాబాద్ కేంద్రంగా వేర్వేరు ప్రదేశాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న నల్లమందు ద్వారా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువ చేసే హెరాయిన్, కోడిన్ తయారు చేసే అవకాశం ఉందన్నారు. రాజస్థాన్కు చెందిన దేవేందర్ కాసినియా, కె.తేజారామ్లను అరెస్టు చేశారు. ముఠాలో కీలకమైన ఫరాస్ కాసినియా పరారీలో ఉన్నాడు. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ధూల్పేట, నారాయణగూడ ఎస్హెచ్వోలు మధుబాబు, రామకృష్ణ, జిల్లా టాస్క్ఫోర్స్ సీఐలు శిరీష, సావిత్రి సౌజన్య పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను అభినందించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్