తక్కువ ధరకు బంగారమంటూ మోసం!.. 13 మంది నుంచి రూ.6.12 కోట్ల వసూలు
తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.
ఏపీలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ఈనాడు, హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ సోమనారాయణ సింగ్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతికి చెందిన గంటా శ్రీధర్ (40) మాదాపూర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. కొండాపూర్ మసీదు బండలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. సహోద్యోగులు, వారి కుటుంబికులతో పాటు.. కొంపల్లిలో ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలు చేస్తారని.. అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పేవాడు. డబ్బు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత బంగారం డెలివరీ అవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు బదిలీ చేశారు. మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు. వీరందరికీ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు ఇచ్చాడు. సికింద్రాబాద్లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి.. భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా కొండాపూర్లోని అతను ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి.. శనివారం రిమాండుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.