రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ భారాస కార్యకర్త మృతి
రోడ్డు నిర్మాణం విషయంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగార్ బొగుడ తండాలో శనివారం రాత్రి జరిగింది.
ముగ్గురికి గాయాలు
కల్హేర్, నారాయణఖేడ్, న్యూస్టుడే: రోడ్డు నిర్మాణం విషయంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగార్ బొగుడ తండాలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై మైపాల్రెడ్డి, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. తండాకు ఉపాధి పథకం కింద 2023లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరైంది. అయితే పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. గతంలో నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా మరోచోట రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు తండావాసులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, భారాస కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఘర్షణకు దారితీసింది. కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో భారాస కార్యకర్త శ్రీను నాయక్(25) తీవ్రంగా గాయపడగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీనునాయక్ను సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని చెప్పారు. క్షతగాత్రులు నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు తండా నుంచి పారిపోయారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో తండాలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పరామర్శించారు.
ఎన్నికల్లో లబ్ధికే హత్యా రాజకీయాలు: భూపాల్రెడ్డి
కాంగ్రెస్ నాయకులు హత్యా రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని భూపాల్రెడ్డి ఆరోపించారు. శనివారం రాత్రి నారాయణఖేడ్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీనునాయక్ను కాంగ్రెస్ వారు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చాక కొత్త పనులు ప్రారంభించకూడదని.. కాంగ్రెస్ వారితో అధికారులు కుమ్మక్కై పలు గ్రామాల్లో పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. సిర్గాపూర్ పీఆర్ ఏఈ మాధవనాయుడు, డీఈఈ మధుసూదన్రెడ్డిపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్