బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జోగిపేటలో యువకుడి దారుణం
చోరీ చేసి, డబ్బులు పంచుకోవడంలో గొడవ
జోగిపేట, న్యూస్టుడే: చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. సీఐ అనిల్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన వడ్డె నాగరాజు (24)కు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ వద్ద ఉంటూ, జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. కొద్ది రోజులుగా ఓ పాత ఇనుప సామగ్రి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో దుకాణంలో పనిచేస్తున్న బాలుడి (14)తో పరిచయం పెరిగింది. ఇద్దరూ కలిసి బాలుడు పనిచేస్తున్న దుకాణంలో శనివారం కాపర్ తీగను చోరీ చేశారు. దాన్ని నాగరాజు పనిచేస్తున్న దుకాణంలో అమ్మారు. సుమారు రూ.20 వేలు వచ్చాయి. ఆ డబ్బును పంచుకోవడంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న నాగరాజు, మాయమాటలు చెప్పి అతణ్ని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి హత్యచేసి, మృతదేహాన్ని సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఓ చిరువ్యాపారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యాపారిని డబ్బులు డిమాండ్ చేయగా.. ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహించి ఇనుప రాడ్డుతో అతని తలపై కొట్టడంతో అతను గాయపడ్డాడు.
ఈ ఘటనలతో భయాందోళనలకు లోనైన నాగరాజు శనివారం రాత్రి సమీపంలోని ఓ సెల్టవర్ ఎక్కి ఫోన్ ద్వారా జరిగిన విషయాలపై స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో అతన్ని కిందకు దింపేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై కూడా కొడవలితో దాడిచేసి గాయపర్చాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని టవర్ దిగమని ఎంతచెప్పినా వినలేదు. రాత్రంతా టవర్పైనే ఉన్న అతను ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రాణాలతోనే ఉన్నాడు. బాలుడు ఏమయ్యాడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా చంపేసి బావిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించారు. టవర్పైనే ఉన్న నాగరాజుకు సంబంధించి కదలికలు లేకపోవడంతో, పరిస్థితిని నిర్ధరించేందుకు డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. అప్పటికే అతను కేబుల్ వైర్లు మెడకు చుట్టుకుని మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను పైకి పంపించి మృతదేహాన్ని కిందకు దింపించారు. ఇద్దరి మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆస్తి కోసం తన భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టింది. -
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. -
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పార్సిల్ పంపడంతో అది పేలి భర్త, కుమార్తె మరణించిన ఘటన గుజరాత్లోని వడాలిలో గురువారం చోటుచేసుకుంది. -
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు