మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది.
మూసాపేట, న్యూస్టుడే: మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్పల్లి వైజంక్షన్లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన తెలిసిందే. రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ అమానుషానికి పాల్పడిన యువకులు సంగారెడ్డికి చెందిన వారుగా విచారణలో తేలింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టడంతో ఆచూకీ లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ యువకులు సంగారెడ్డిలోనే ఉన్న ఓ బార్లో పనిచేస్తారని తేలింది. బార్లో అర్ధరాత్రి వరకు పనిచేసిన వారు బాగా మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వైజంక్షన్ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేదని, ఆరు నెలల క్రితం వరకు ఓ వాహన షోరూంలో స్వీపర్గా పని చేసేదని తెలిసింది. అక్కడ సిబ్బందిని విచారించినా ఆమె చిరునామా తెలియలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు