ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
నస్పూర్, తాండూరు, ముదిగొండ, డోర్నకల్, మహబూబాబాద్ రూరల్, రాజేంద్రనగర్, రామచంద్రాపురం రూరల్, న్యూస్టుడే: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు.
- మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన విద్యార్థిని(18) మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైంది. సెల్ఫోన్ సిగ్నల్ రావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి పై అంతస్తులోకి వెళ్లింది. చాలా సమయమైనా కిందికి రాకపోవడంతో తల్లిదండ్రులు పై అంతస్తుకు వెళ్లి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.
- మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన విద్యార్థి(16) మొదటి సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్నాడు. నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడు కాలేదు. మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
- ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన విద్యార్థిని(17) మొదటి సంవత్సరం మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె ఫెయిల్ అయినట్లు తెలిసి.. ఫర్వాలేదులే అని ధైర్యం చెప్పానని అయినా ఇలా చేస్తుందనుకోలేదని తండ్రి వాపోయారు.
- మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని(16) సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎకనామిక్స్లో ఫెయిల్ కావడంతో వ్యవసాయ బావిలో దూకి ఉసురు తీసుకుంది.
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన విద్యార్థిని(17) బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బోటనీలో ఫెయిలైంది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకుంది.
- రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో నివాసం ఉండే విద్యార్థిని(16) ఎంపీసీ మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
- సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న విద్యార్థి(17) ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశాడు. ఫలితాలు చూసుకుని చెరువు గట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉరేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే