దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు.
ఆస్తి కోసం ఘాతుకం
ఖమ్మం జిల్లా గోపాలపేటలో ఘటన
నిందితుడు వెంకటేశ్వర్లు
తల్లాడ, న్యూస్టుడే: భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. కానీ గ్రామంలోని పొలంపై కన్నేసిన ఆమె కొడుకు అర్ధరాత్రి వేళ తల్లితో సహా ఇద్దరు కూతుళ్లనూ పాశవికంగా కడతేర్చి పరారయ్యాడు. ఈ అమానవీయ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గోపాలపేటలో పిట్టల వెంకటేశ్వర్లుకు దివ్యాంగురాలు (ఒక కన్ను కనిపించదు) అయిన తల్లి పిచ్చమ్మ(60), కూతుళ్లు నీరజ(11), ఝాన్సీ(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య కనకదుర్గ చనిపోయారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇల్లు, ఎకరం పది గుంటల పొలంలో సగం ఇద్దరు పిల్లలకు దక్కేలా పెద్దల సమక్షంలో ఒప్పందం రాసుకున్నారు. తరువాత వెంకటేశ్వర్లు తల్లాడకు చెందిన త్రివేణిని రెండో వివాహం చేసుకొని పిల్లలను, తల్లిని వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టాడు. దీంతో పిచ్చమ్మనే మనవరాళ్ల బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు. నీరజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే నాలుగో తరగతి పూర్తి చేయగా.. ఐదో తరగతికి కల్లూరులోని గురుకుల పాఠశాలలో సీటు రావడంతో చేరింది. ఝాన్సీ అంగన్వాడీ విద్య పూర్తి చేసింది. డ్రైవరుగా పని చేసే వెంకటేశ్వర్లు కొంతకాలంగా చెడు వ్యసనాలతో అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చేందుకు తల్లి పిచ్చమ్మ పేరున ఉన్న దాదాపు అరెకరం పొలాన్ని అమ్మాలంటూ అప్పుడప్పుడు వచ్చి గొడవపడేవాడు. మనవరాళ్ల భవిష్యత్తు దృష్ట్యా అమ్మేది లేదంటూ ఆమె నిరాకరిస్తూ వచ్చేవారు. దీంతో కక్ష పెంచుకొని ముగ్గురినీ అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.
మృతులు పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీ
శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో గ్రామంలో పక్కింటి వారికి ఫోన్ చేసిన వెంకటేశ్వర్లు పిచ్చమ్మ, నీరజలను పిలిపించి మాట్లాడాడు. తాను కాసేపట్లో ఇంటికి వస్తున్నానని చెప్పడంతో కూతురు సంతోష పడింది. కానీ రోజూ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచే పిచ్చమ్మ శనివారం ఉదయమైనా కనిపించకపోవడంతో చుట్టుపక్కల మహిళలు వెళ్లి చూడగా రేకులషెడ్డు కింద తిరగల వేసిన మంచంపై పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీలు విగతజీవులుగా కనిపించారు. ముగ్గురికీ గొంతు, ముఖం, శరీర భాగాలపై గాయాలు ఉన్నాయి. నీరజ నోటిలో నురగ కూడా ఉంది. ఆస్తి కోసమే వారిని వెంకటేశ్వర్లు హతమార్చి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అర్ధరాత్రి వచ్చి ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్, ఎస్సై వంశీకృష్ణ, భాగ్యరాజ్లు పరిశీలించారు. వెంకటేశ్వర్లు బావమరిది, కనకదుర్గ సోదరుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తల్లాడ ఏఎస్సై జేవియర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక