బెట్టింగ్ పునాదులపై చీకటి సామ్రాజ్యం
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందేలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు.
ఖరీదైన కార్లు, పలు నగరాల్లో విల్లాలు, ఇళ్లు
రూ.కోట్లకు పడగలెత్తిన రేవ్ పార్టీ నిందితుడు వాసు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - విజయవాడ (చిట్టినగర్): రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందేలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించే ఇదంతా. విజయవాడ ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది సాధారణ కుటుంబమే. తల్లి దోసెలు అమ్మేది. తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్గా ఎదగాలన్నది లక్ష్యం. ఆటపై అభిమానమే బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చిత్తూరు, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150 మంది పైగా ఉన్నారు. అనంతరం వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్లు కూడా నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేసియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు.
విమానాలు, లగ్జరీ కార్లలోనే ప్రయాణం
ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాసుకు రూ.కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబయిలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహరాలు నడుపుతుంటాడు. విజయవాడలో చాలాసార్లు పెద్దఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడినా పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు. బెంగళూరు రేవ్పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతుండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతి కర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టంట్ వేసినట్లు సమాచారం.
రేవ్పార్టీ కేసు.. సీసీబీకి దర్యాప్తు బాధ్యతలు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: బెంగళూరు రేవ్పార్టీ కేసును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) దర్యాప్తు చేస్తుందని డీజీపీ అలోక్మోహన్ బుధవారం ప్రకటించారు. మాదక ద్రవ్యాల కట్టడి విభాగం అధికారులు వారికి సహకరిస్తారని పేర్కొన్నారు. తొలుత ఈ కేసును ఎలక్ట్రానిక్సిటీ ఠాణాకు.. ఆపై హెబ్బగూడి ఠాణాకు బదిలీ చేసినా చివరికి సీసీబీ దర్యాప్తునకే అధికారులు మొగ్గు చూపారు. సీసీబీ ఇన్స్పెక్టర్ లక్ష్మీప్రసాద్ను దర్యాప్తు అధికారిగా నియమించారు. స్థిరాస్తి వ్యాపారి వాసు పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ నెల 18న సాయంత్రం రేవ్పార్టీ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల కుటుంబీకులు, సినీ, బుల్లితెర కళాకారులూ కలసి 250 మంది హాజరైనట్లు తేలింది. ఇప్పటికి 101 మందిని గుర్తించగా.. పరారైనవారి వివరాలు సేకరిస్తున్నారు. కార్యక్రమంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసుల హిట్లిస్ట్లో ఉన్న మత్తుపదార్థాల సరఫరాదారు రాజ్భావ సరకు సరఫరాలో కీలక భూమిక పోషించాడని సమాచారం. రక్త నమూనాల పరీక్షల నివేదిక కోసం దర్యాప్తు అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా బెంగళూరు శివార్లలో ఉన్న ఫాం హౌస్ల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని నగర పోలీసు కమిషనర్ దయానంద్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్