బెట్టింగ్ పునాదులపై చీకటి సామ్రాజ్యం
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందేలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు.
ఖరీదైన కార్లు, పలు నగరాల్లో విల్లాలు, ఇళ్లు
రూ.కోట్లకు పడగలెత్తిన రేవ్ పార్టీ నిందితుడు వాసు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - విజయవాడ (చిట్టినగర్): రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందేలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించే ఇదంతా. విజయవాడ ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది సాధారణ కుటుంబమే. తల్లి దోసెలు అమ్మేది. తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్గా ఎదగాలన్నది లక్ష్యం. ఆటపై అభిమానమే బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చిత్తూరు, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150 మంది పైగా ఉన్నారు. అనంతరం వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్లు కూడా నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేసియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు.
విమానాలు, లగ్జరీ కార్లలోనే ప్రయాణం
ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాసుకు రూ.కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబయిలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహరాలు నడుపుతుంటాడు. విజయవాడలో చాలాసార్లు పెద్దఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడినా పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు. బెంగళూరు రేవ్పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతుండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతి కర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టంట్ వేసినట్లు సమాచారం.
రేవ్పార్టీ కేసు.. సీసీబీకి దర్యాప్తు బాధ్యతలు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: బెంగళూరు రేవ్పార్టీ కేసును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) దర్యాప్తు చేస్తుందని డీజీపీ అలోక్మోహన్ బుధవారం ప్రకటించారు. మాదక ద్రవ్యాల కట్టడి విభాగం అధికారులు వారికి సహకరిస్తారని పేర్కొన్నారు. తొలుత ఈ కేసును ఎలక్ట్రానిక్సిటీ ఠాణాకు.. ఆపై హెబ్బగూడి ఠాణాకు బదిలీ చేసినా చివరికి సీసీబీ దర్యాప్తునకే అధికారులు మొగ్గు చూపారు. సీసీబీ ఇన్స్పెక్టర్ లక్ష్మీప్రసాద్ను దర్యాప్తు అధికారిగా నియమించారు. స్థిరాస్తి వ్యాపారి వాసు పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ నెల 18న సాయంత్రం రేవ్పార్టీ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల కుటుంబీకులు, సినీ, బుల్లితెర కళాకారులూ కలసి 250 మంది హాజరైనట్లు తేలింది. ఇప్పటికి 101 మందిని గుర్తించగా.. పరారైనవారి వివరాలు సేకరిస్తున్నారు. కార్యక్రమంలో మత్తు పదార్థాల విక్రయం, వినియోగం పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసుల హిట్లిస్ట్లో ఉన్న మత్తుపదార్థాల సరఫరాదారు రాజ్భావ సరకు సరఫరాలో కీలక భూమిక పోషించాడని సమాచారం. రక్త నమూనాల పరీక్షల నివేదిక కోసం దర్యాప్తు అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా బెంగళూరు శివార్లలో ఉన్న ఫాం హౌస్ల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని నగర పోలీసు కమిషనర్ దయానంద్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరు గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
అంతా చూస్తుండగానే అంతమొందించారు
భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
అటవీ అధికారులపై మూకుమ్మడి దాడి
అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మధ్యప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు భక్తుల మృతి
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం
ఝార్ఖండ్లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్ ఉంటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
రైల్లో మంటలంటూ వదంతులు.. భయంతో దూకేసిన ముగ్గురి మృతి
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్లో చోటు చేసుకుంది. -
అదుపు తప్పి లారీ బోల్తా.. ఇద్దరు ఉద్యోగుల మృతి
లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
-
వాళ్ల స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్ అశ్విన్
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్
-
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
-
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ఎలా ఉంది?