అనిశాకు చిక్కిన భైంసా మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ ఎం.వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్లు లంచం తీసుకుంటూ బుధవారం అనిశాకు పట్టుబడ్డారు.
పట్టుబడిన బిల్ కలెక్టర్ విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ ఎం.వెంకటేశ్వర్లు
భైంసా, న్యూస్టుడే: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ ఎం.వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్లు లంచం తీసుకుంటూ బుధవారం అనిశాకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వి.వి.రమణమూర్తి ఈ వివరాలు తెలిపారు. భైంసాలోని పురాణబజార్కు చెందిన రాధేశ్యాం.. 2022లో పురపాలక సంఘం అనుమతులతో వాణిజ్య భవనం నిర్మించుకున్నారు. కాగా ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఈ నెల 16న పురపాలక కమిషనర్ తాఖీదు జారీ చేశారు. నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలంటే రూ.30 వేలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ద్వారా డిమాండ్ చేశారు. లేకుంటే భవనాన్ని కూల్చివేస్తామని బెదిరించారు. దీంతో రాధేశ్యాం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల వేసి కమిషనర్, బిల్ కలెక్టర్లను పట్టుకున్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు 2019లోనూ నర్సంపేటలో ఏసీబీకి చిక్కారు.
ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల సస్పెన్షన్
ఈనాడు, హైదరాబాద్: పొరుగు సేవల ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సస్పెండ్ చేసింది. ప్రసుతం బాన్సువాడ, తుర్కయాంజిల్లో కమిషనర్లుగా పనిచేస్తున్న ఐఎంఏ అలీం, సత్యనారాయణరెడ్డిలను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ డైరెక్టర్ డి.దివ్య బుధవారం ఉత్తర్వులిచ్చారు. అలీం గతంలో భైంసాలో, సత్యనారాయణరెడ్డి నిర్మల్లో పనిచేసిన సమయంలో పొరుగు సేవల ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం