రోడ్డుపై గుంతతో కానిస్టేబుల్కు గాయాలు
బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
అదే గుంత కారణంగా వరుస ప్రమాదాలు
ప్రమాదానికి కారణమైన గుంత
మోరంపూడి (దుగ్గిరాల), న్యూస్టుడే: బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి పెట్రోల్ బంక్ దాటగానే రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో పడింది. దీంతో బైక్పై ఉన్న భార్య అరుణ, కుమారుడు బాలపవన్తో సహా సాయిరామ్ కిందపడ్డారు. కానిస్టేబుల్ ముఖానికి గాయాలయ్యాయి. కుమారుడి ముక్కుకి కూడా స్వల్పంగా గాయమైంది. రోడ్డుపై వెళ్లే వారు గమనించి వెంటనే 108కి సమాచారమిచ్చి, క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారిపై ఉన్న గుంతను పూడ్చడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ఆ గుంత కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగాయి. దానికి ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
108 వాహనంలో.. గాయపడిన కానిస్టేబుల్, ఆయన భార్య, కుమారుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనుగు దాడిలో వృద్ధుడి దుర్మరణం.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీయం తండాలో చోటుచేసుకుంది. కుప్పం ఎఫ్ఆర్వో జయశంకర్ వివరాల మేరకు.. తండాకు చెందిన కన్నానాయక్(65) శనివారం రాత్రి పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లారు. -
ఫైనాన్స్ వాహనాలే లక్ష్యంగా మోసాలు
-
ఘర్షణ ఘటనలో 14 మంది అరెస్టు
గోవుల రవాణా నేపథ్యంలో శనివారం రాత్రి మెదక్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనను నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్కు ఓ వర్గం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్