రోడ్డుపై గుంతతో కానిస్టేబుల్కు గాయాలు
బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
అదే గుంత కారణంగా వరుస ప్రమాదాలు
ప్రమాదానికి కారణమైన గుంత
మోరంపూడి (దుగ్గిరాల), న్యూస్టుడే: బంధువుల్ని కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్ను గుంతల రూపంలో ఎదురైన ప్రమాదం ఆసుపత్రి పాలుజేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి పెట్రోల్ బంక్ దాటగానే రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో పడింది. దీంతో బైక్పై ఉన్న భార్య అరుణ, కుమారుడు బాలపవన్తో సహా సాయిరామ్ కిందపడ్డారు. కానిస్టేబుల్ ముఖానికి గాయాలయ్యాయి. కుమారుడి ముక్కుకి కూడా స్వల్పంగా గాయమైంది. రోడ్డుపై వెళ్లే వారు గమనించి వెంటనే 108కి సమాచారమిచ్చి, క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారిపై ఉన్న గుంతను పూడ్చడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ఆ గుంత కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగాయి. దానికి ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
108 వాహనంలో.. గాయపడిన కానిస్టేబుల్, ఆయన భార్య, కుమారుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.