నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీల పేరిట విక్రయిస్తున్న ముఠా గుట్టును అధికారులు శుక్రవారం రట్టు చేశారు.
ఆదిలాబాద్లో గోదామును తనిఖీ చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్ నేర విభాగం, బెజ్జూరు, తాండూరు, న్యూస్టుడే: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీల పేరిట విక్రయిస్తున్న ముఠా గుట్టును అధికారులు శుక్రవారం రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని రాంనగర్ సమీపంలోని హనుమాన్నగర్లో ప్రధాన రహదారిపై ఉన్న గోదాముపై వ్యవసాయశాఖాధికారులు, పోలీసులు దాడి చేశారు. విత్తనాలకు ఎరుపు రంగు వేసి, ఆరబెట్టి అక్కడే ప్రముఖ కంపెనీల ప్యాకెట్లలో నింపి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రూ.19 లక్షల సరకును స్వాధీనం చేసుకోవడంతోపాటు గోదామును సీజ్ చేశారు. నిందితులు సామ అశోక్రెడ్డి, మణికంఠ, అప్పాల రాజేందర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయశాఖాధికారులు పుల్లయ్య, శివ, రమేశ్, గ్రామీణ సీఐ ఫణిధర్, మావల ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు. అలాగే కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామానికి చెందిన తొర్రెం ప్రశాంత్ ఇంట్లో దాడులు నిర్వహించి 70 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. మరో ఘటనలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎర్రవోతు రాజు ఇంట్లో 25 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే