మూడు గంటల వ్యవధిలో తండ్రీకూతుళ్ల మృతి
వరకట్న వేధింపులతో కుమార్తె.. రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి.. మూడు గంటల వ్యవధిలో మృతి చెందిన విషాద ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అదనపుకట్నం వేధింపులతో కుమార్తె ఆత్మహత్య
గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రి దుర్మరణం
జ్యోతి, రాథోడ్ లక్ష్మణ్
రెంజల్, నవీపేట, న్యూస్టుడే: వరకట్న వేధింపులతో కుమార్తె.. రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి.. మూడు గంటల వ్యవధిలో మృతి చెందిన విషాద ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రెంజల్ మండలం వీరన్నగుట్టతండాకు చెందిన రాథోడ్ లక్ష్మణ్ (52) తన బిడ్డ జ్యోతి (36)ని 15 ఏళ్ల కిందట నవీపేట మండలం అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాశ్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో రాథోడ్ లక్ష్మణ్ ఎకరం పొలం కట్నం కింద ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకు కొడుకు పుట్టలేదంటూ ప్రకాశ్ అబ్బాపూర్ తండాకు చెందిన రాణిని నాలుగేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కొడుకు. ఈక్రమంలో అదనపు కట్నం కింద రూ.5 లక్షలు, ఎకరం భూమి తీసుకురావాలని భర్త ప్రకాశ్, అతని రెండో భార్య, అత్తామామ కలిసి జ్యోతిని వేధింపులకు గురి చేశారు. మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 22న అత్తగారింట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు తొలుత నవీపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు, తర్వాత నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. ఈ సమాచారాన్ని జ్యోతి తండ్రికి గురువారం తెలిపారు. ఆయన దవాఖానాకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. ఈ విషయాన్ని తండావాసులకు చెప్పేందుకు తన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. తండ్రి వెళ్లిన కొద్దిసేపటికే రాత్రి 7 గంటల సమయంలో జ్యోతి కన్నుమూశారు. ప్రయాణంలో ఉన్న రాథోడ్ లక్ష్మణ్ వాహనాన్ని రెంజల్ మండలం కల్యాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ రాత్రి పది గంటల సమయంలో రాథోడ్ లక్ష్మణ్ మృతిచెందారు. జ్యోతి మృతిపై ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు భర్త ప్రకాశ్, అత్తామామ ఫరెంగిబాయి, సోమ్లా, ప్రకాశ్ రెండో భార్య రాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. రాథోడ్ లక్ష్మణ్ ప్రమాదంపై ఆయన భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెంజల్ ఎస్సై సాయన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం