‘ట్రాక్టర్ ఆపే దమ్ముందా.. సంగతి చూస్తా’
గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతుండడమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే యంత్రాంగం చేసిన తప్పు.
పట్టుకున్న సిబ్బందికి బెదిరింపు
వీఆర్ఏను కొట్టి.. దూషించడంపై కేసు
సీతానగరం, న్యూస్టుడే: గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతుండడమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే యంత్రాంగం చేసిన తప్పు. అంతే.. ఇసుక తరలిస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. వీఆర్ఏపై దాడికి దిగాడు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టరును సైతం పట్టుకుపోయాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గళ్ల వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. వీఆర్వో గోసాల చిన్న, వీఆర్ఏ మద్దాల దుర్గారావు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గళ్ల నుంచి బొబ్బిల్లంక వరకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రేవుల వద్ద వీరు కాపలా ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టరును ముగ్గళ్ల వద్ద పట్టుకుని పోలీసుస్టేషన్కు తీసుకెళుతుండగా వాహన యజమాని పాలడుగుల రాము వచ్చి బెదిరించాడు.
‘స్టేషన్కు తీసుకెళితే అంతు చూస్తానని.. ట్రాక్టరు ఆపే దమ్ముందా’ అంటూ కులం పేరుతో రెవెన్యూ సిబ్బందిని దూషించాడు. ట్రాక్టరు తాళాలు తీసుకునే ప్రయత్నం చేసిన వీఆర్ఏ దుర్గారావును కొట్టి పరుష పదజాలంతో భయభ్రాంతులకు గురిచేశాడు. ట్రాక్టరుకు అడ్డుగా పెట్టిన తమ బైక్ల తాళాలు దౌర్జన్యంగా తీసుకుని.. ట్రాక్టరు తమ మీదకు వచ్చేలా పోనివ్వడంతో పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకున్నామని సిబ్బంది చెప్పారు. ఇసుక అక్రమాలను అడ్డుకునే సమయంలో ఇసుకాసురుల నుంచి తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల ద్వారా కలెక్టర్కు విన్నవించి.. పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఫిర్యాదు మేరకు నిందితుడు రాముపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!