రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి దుర్మరణం
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
కారు డ్రైవరూ మృత్యువాత
ప్రమాదంలో దెబ్బతిన్న కారు
జగ్గంపేట గ్రామీణం, న్యూస్టుడే: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీప జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ధాటికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాను మీదకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న విశ్రాంత జడ్జి వి.మోహన్కుమార్(65) అక్కడికక్కడే మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న కారు డ్రైవర్ శ్రీను(35)ను వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మోహన్కుమార్ ప్రకాశం జిల్లా న్యాయస్థానంలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. విజయనగరం జిల్లా వినియోగదారుల ఫోరం ఛైర్మన్గా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఎడ్జ్యూడికేటింగ్ అధికారిగా విజయవాడ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరంలో ఉంటున్న మోహన్కుమార్ కారులో విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న బస్సు ఆగకుండా వెళ్లిపోవడంతో గండేపల్లి మండల పరిధిలో పోలీసులు అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.