గోవాలో విషాదం.. గుడిసెల్లోకి దూసుకెళ్లిన బస్సు

గోవాలోని సౌత్‌ గోవా జిల్లాలో శనివారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లోకి ఓ ప్రైవేటు బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 27 May 2024 05:32 IST

నలుగురు కూలీల మృతి

పనాజీ: గోవాలోని సౌత్‌ గోవా జిల్లాలో శనివారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లోకి ఓ ప్రైవేటు బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెర్నా ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద వలస కూలీలు వారి గుడిసెల్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తనకు ఫోన్‌ రావడంతో గుడిసెలో నుంచి బయటకు వచ్చానని రూపేందర్‌ మాథుర్‌ అనే కూలీ తెలిపారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమన్నారు. ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని డ్రైవర్‌ బెదిరించినట్లుగా వాపోయాడు. బాధితులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని