విద్యార్థిని బలిగొన్న రుణయాప్
రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
రూ.10 వేల రుణానికి రూ.లక్ష చెల్లించాలంటూ వేధింపులు
తట్టుకోలేక ఆత్మహత్య
వంశీ
తాడేపల్లి, న్యూస్టుడే: రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ న్యూగిరిపురానికి చెందిన మురికింటి వంశీ(21) తాడేపల్లి మండలంలోని ఓ విశ్వవిద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం యాప్ ద్వారా రూ.10 వేల రుణాన్ని తీసుకున్నాడు. తర్వాత నగదు చెల్లించినప్పటికీ రూ.లక్ష చెల్లించాల్సిందేనంటూ యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. ఇంట్లో చెప్పకుండా రుణం తీసుకోవడం.. తిరిగి చెల్లిస్తున్నా ఇంకా చెల్లించాలని పదే పదే ఒత్తిడి చేస్తుండటంతో ఎవరికీ చెప్పుకోలేక మానసిక వ్యథకు గురయ్యాడు. దీంతో ఈ నెల 25న రాత్రి బైక్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆతర్వాత తండ్రి ఏసుదాసు ఫోన్కు అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి అంటూ మెసేజ్ పంపించాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు చేపట్టగా కృష్ణానది ఒడ్డున బైక్ కనపడింది. అప్పటి నుంచి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నదిలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకుని వచ్చి చూడగా వంశీదేనని తేలింది. తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఏసుదాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన వంశీని కష్టపడి ఇంజినీరింగ్ చదివిస్తుంటే రుణయాప్ అతడి ప్రాణాలను బలిగొంది. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు