ఉమామహేశ్వర్‌రావుకు మూడు రోజుల కస్టడీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టై రిమాండులో ఉన్న సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం అనిశా కోర్టు విచారించింది.

Published : 29 May 2024 04:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టై రిమాండులో ఉన్న సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం అనిశా కోర్టు విచారించింది. నిందితుడ్ని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉమామహేశ్వర్‌రావును గతవారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని