మద్యం తాగడానికి అంగీకరించలేదని.. మేడపై నుంచి కిందకు తోసేశారు

తమతోపాటు మద్యం తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు వ్యక్తులు మేడపై నుంచి కిందకు తోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకొంది.

Published : 29 May 2024 05:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమతోపాటు మద్యం తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు వ్యక్తులు మేడపై నుంచి కిందకు తోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. స్థానిక రుప్పుర్‌ ఖద్రా అనే ప్రదేశంలో రంజిత్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు.  బాధితుడు రంజిత్‌ను నలుగురు వ్యక్తులు శనివారం ఇంటి డాబాపైకి తీసుకెళ్లారు. మద్యం తాగే విషయంలో గొడవపడి రంజిత్‌పై దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో ఇది శ్రుతి మించి రంజిత్‌ను ఒక వ్యక్తి డాబాపై నుంచి కిందకు తోసేశాడు. మిగిలిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. స్థానికులు రంజిత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని