ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు.
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు. మద్దేడ్ పోలీస్స్టేషన్ పరిధి బందేపార అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బీజాపుర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. మద్దేడ్ ఏరియా కమిటీ సభ్యుడు బుచ్చన్న మరో 15-20 మంది మావోయిస్టులతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో మే 27న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయి. తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించగా మావోయిస్టులు మనీలా పూనెం(28), మంగ్లూ కుడియం(40) మృతదేహాలు కనిపించాయి. మనీలాపై 12కుపైగా హత్యలు, పలు హత్యాయత్నాలు, లూటీ కేసులు ఉన్నాయి. ఆమెపై రూ.8 లక్షల రివార్డు ఉంది. మంగ్లూ కుడియం మద్దేడ్ ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్ కమాండర్గా ఉన్నారు. అతడిపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ఘటనతో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 118కి చేరింది.
పది మంది లొంగుబాటు
దంతెవాడ జిల్లాలో ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన 10మంది మావోయిస్టులు ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట బుధవారం లొంగిపోయారు. వీరంతా ఘర్వాపసీ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయారు. గతంలో వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళ, నలుగురు మైనర్లు ఉన్నారు.
సుక్మా జిల్లా కేరళపాల్ పోలీస్స్టేషన్ పరిధి సిమెల్ అటవీ ప్రాంతంలో ఓ మహిళా మావోయిస్టును భద్రతా బలగాలు పట్టుకున్నాయి. పోలీసు అధికారుల విచారణ అనంతరం బుధవారం ఆమెను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు