హిమాలయాల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన నలుగురి మృతి
హిమాలయాల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన నలుగురు పర్యాటకులు మృత్యువాత పడినట్లు ఉత్తర్ప్రదేశ్లోని ఉత్తర్కాశీ జిల్లా కలెక్టర్ మెహర్బాన్ సింగ్ బుధవారం వెల్లడించారు.
చిక్కుకుపోయిన 18 మంది
ఉత్తర్కాశీ: హిమాలయాల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన నలుగురు పర్యాటకులు మృత్యువాత పడినట్లు ఉత్తర్ప్రదేశ్లోని ఉత్తర్కాశీ జిల్లా కలెక్టర్ మెహర్బాన్ సింగ్ బుధవారం వెల్లడించారు. మరో 18 మంది అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. 22 మందితో కూడిన ఈ పర్వతారోహకుల బృందం మే 29న 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్త్రతాల్ సరస్సుకు బయలుదేరింది. వీరిలో 18 మంది కర్ణాటకకు చెందిన వారు కాగా ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మరో ముగ్గురు స్థానిక గైడ్లు తోడుగా ట్రెక్కింగ్కు వెళ్లారు. మనేరీలో ఉన్న ఓ పర్యాటక ఏజెన్సీ సాయంతో ఈ బృందం ఈ 35 కి.మీ. ట్రెక్కింగ్ను ఉత్తర్కాశీ నుంచి ప్రారంభించింది. వీరు ఈ నెల 7న తిరిగి రావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వారిలో నలుగురు చనిపోగా.. మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిసింది. బాధితులకు సాయం అందించడానికి సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.