తెదేపా కార్యకర్త దారుణ హత్య

తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై.. వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. పసుపుజెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాయి.

Published : 08 Jun 2024 06:38 IST

ఓటమిని జీర్ణించుకోలేక దాడి చేసిన వైకాపా మూకలు

షేక్‌ ఖాశిం

తుమ్మపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై.. వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. పసుపుజెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాయి. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 4న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తెదేపా విజయం సాధించడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పార్టీ కార్యకర్త షేక్‌ ఖాశిం(24) సంబరాలు చేసుకున్నారు. తన స్నేహితుడి ద్విచక్రవాహనానికి తెదేపా జెండా కట్టి ఇద్దరూ రేవేంద్రపాడు బయలుదేరారు. ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు తుమ్మపూడి వద్ద వీరి వాహనాన్ని ఆపారు. కర్రలతో ఇద్దరిపై దాడి చేశారు. క్రికెట్‌ బ్యాట్‌తో ఖాశిం తల వెనుక కొట్టడంతో కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు బాధితులను చూసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖాశిం కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. దాడికి పాల్పడిన బోడపాటి కమలాకరరావు, హృదయరాజు, హర్షవర్ధన్, పల్లం రవీంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వెంకట్రావ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని