పోలీసు యాప్ల హ్యాకర్ 20 ఏళ్ల విద్యార్థి!
పోలీసు యాప్లను హ్యాక్ చేసి, అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఎట్టకేలకు పట్టుకుంది.
ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన జతిన్కుమార్గా నిర్ధారణ
దిల్లీలో అరెస్టు చేసి తీసుకొచ్చిన టీజీసీఎస్బీ బృందం
ఈనాడు, హైదరాబాద్: పోలీసు యాప్లను హ్యాక్ చేసి, అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఎట్టకేలకు పట్టుకుంది. హ్యాకర్ దిల్లీలో ఉంటున్న విద్యార్థి జతిన్కుమార్(20)గా గుర్తించి శనివారం అక్కడకు వెళ్లి అరెస్టు చేసింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీకి చెందిన జతిన్ గ్రేటర్ నొయిడాలో ఉంటూ చదువుకుంటున్నాడు. తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్ఐ’ యాప్ను గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్ చేసినట్లు టీజీసీఎస్బీ ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తెలంగాణ పోలీసుశాఖకే చెందిన ‘టీఎస్కాప్’ యాప్, ‘ఎస్ఎంఎస్ సర్వీసెస్’లోని డేటాను కూడా అదే హ్యాకర్ దొంగిలించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆ డేటాను 150 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తామంటూ అంతర్జాలంలో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు హ్యాకర్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసుల డేటాను కొనుగోలు చేయదలిచినవారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్ రెండు టెలిగ్రామ్ ఐడీలను అంతర్జాలంలో పొందుపరిచాడు. తనను పోలీసులు గుర్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే టీజీసీఎస్బీ పోలీసులు సోషల్ ఇంజినీరింగ్ విధానాన్ని వినియోగించి హ్యాకర్ జతిన్కుమార్ దిల్లీలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసింది. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ రిమాండుపై హైదరాబాద్కు తీసుకొచ్చారు. విచారణ క్రమంలో నిందితుడు గతంలోనూ ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్లు తేలింది. ఆధార్తోపాటు మరికొన్ని కీలక ఏజెన్సీల డేటాను లీక్ చేసినట్లు గుర్తించారు. బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ పర్యవేక్షణలో తక్కువ సమయంలో కేసును పరిష్కరించినందుకు ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిష్రెడ్డి, కానిస్టేబుల్ సురేశ్ను డీజీపీ రవిగుప్తా అభినందించారు. పోలీసుశాఖకు చెందిన యాప్లు హ్యాక్ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పుడు ప్రచారం ద్వారా దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్