కరెంటు స్తంభంపైనే కొడిగట్టిన ప్రాణం
కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
ఆదిలాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ గ్రామీణ ఎస్ఐ ముజాహిద్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ గ్రామీణ మండలం రాములుగూడకు చెందిన డి.మోతిరాం (38) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆదివారం యాపల్గూడ గ్రామంలో విద్యుత్ మోటారు కనెక్షన్ కోసం ఏబీ స్విచ్ను ఆఫ్ చేసి ఓ కరెంటు స్తంభంపైకి ఎక్కి పనులు చేస్తున్నారు. అయితే ఆ స్తంభానికి సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా ఆగినప్పటికీ.. త్రీఫేజ్ సరఫరా ఉంది. ఆ విషయాన్ని అతను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృతి చెందారు. అతను ముందస్తుగా విద్యుత్తు శాఖ అధికారులకు లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) కోసం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విద్యుత్ స్తంభంపై మృతదేహం
3 గంటలు స్తంభంపైనే మృతదేహం
సుమారు మూడు గంటల పాటు మోతిరాం మృతదేహం విద్యుత్ స్తంభంపైనే ఉంది. విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే అతను మృతి చెందాడని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రాములుగూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రూ.10 లక్షల నష్ట పరిహారం, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు జూనియర్ లైన్మెన్, ఇతర అధికారులు రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తామని అంగీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. మోతిరాం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేశారని, అతని మృతితో విద్యుత్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం రూ.5 లక్షలు ఇస్తామని ఆ శాఖ ఎస్ఈ జె.ఆర్.చౌహాన్, ఏఈ తిరుపతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి