తెదేపా కార్యకర్త దారుణ హత్య
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్త గిరినాథ్ చౌదరి(35) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.
వేట కొడవళ్లతో నరికిన వైకాపా మూకలు
మృతుడి సోదరుడికి తీవ్ర గాయాలు
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై ఫిర్యాదు
కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత
వెల్దుర్తి, న్యూస్టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్త గిరినాథ్ చౌదరి(35) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సోదరుడు కల్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్నికల ప్రచార సమయం నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వైరం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు కూడా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం గిరినాథ్ చౌదరి, సోదరుడు కల్యాణ్ తమ ఇంటికి వెళ్తుండగా వైకాపా వర్గీయులు వారిపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. గిరినాథ్ తలపై తీవ్ర గాయమైంది. కల్యాణ్కు సైతం దాడిలో గాయపడ్డారు. ఇద్దరినీ వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా.. గిరినాథ్ మార్గమధ్యలో మృతిచెందారు. కల్యాణ్ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తెదేపా శ్రేణులు వైకాపా వర్గీయులకు చెందిన రెండు గడ్డివాములు, ద్విచక్ర వాహనం కాల్చివేశారు. మృతుడు గిరినాథ్కు భార్య భార్గవి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ, రమేష్, చిన్నపామయ్య, మధుసూదన్రెడ్డి, చక్రపాణిరెడ్డి, భాస్కర్రెడ్డి, పద్మనాభరెడ్డి, తేజేశ్వర్రెడ్డి, చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కంగాటి రాంమోహన్రెడ్డితో పాటు మరికొందరు కారణమని మృతుడి తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామంలో బందోబస్తు
గ్రామంలో హత్య గురించి తెలుసుకున్న కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ బొమ్మిరెడ్డిపల్లికి చేరుకుని పరిశీలించారు. తిరిగి ఎలాంటి దాడులు జరగకుండా బందోబస్తు చేపట్టాలని ఎస్సై చంద్రశేఖర్రెడ్డికి సూచించారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గిరినాథ్ చౌదరి మృతదేహాన్ని వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను తెదేపా నాయకులు పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్