Archana Nag : నా దగ్గర ఎక్స్క్లూజివ్ సాక్ష్యాలున్నాయ్.. షేక్ చేస్తా : అర్చనా నాగ్
తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా వగ‘లేడీ’ అర్చనా నాగ్(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
భువనేశ్వర్: తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా మహిళ అర్చనా నాగ్(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించడానికి ముందు వైద్య పరీక్షల కోసం ఝార్పాడ ప్రత్యేక జైలు నుంచి భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద రాష్ట్రాన్ని షేక్ చేసే విధంగా ఎక్స్క్లూజివ్ సాక్ష్యాలు ఉన్నాయని.. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు చెప్పింది. ఈడీ కస్టడీలో విచారణ కోసమే తాను ఎదురుచూస్తున్నానని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొంది. ‘‘నాకు మాట్లాడటానికి తగినంత సమయం కావాలి. కనీసం 30 నిమిషాలైనా అవసరం. నేను మాట్లాడితే రాష్ట్రంలో మొత్తం సీన్ మారిపోతుంది. నన్ను ట్రాప్లో పడేశారు. ఎక్స్క్లూజివ్ ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టను‘‘ అని వ్యాఖ్యలు చేసింది.
తనను అరెస్టు చేసిన తీరుపైనా ఆమె కమిషనరేట్ ఆఫ్ పోలీసులకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేసింది. తానేమీ ఉగ్రవాదిని కాదని.. కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసిన తీరు, తన కుటుంబాన్ని వేధించిన పద్ధతి చూస్తుంటే ఇదంతా తనపై కుట్రలా ఉందని ఆరోపించింది. మరోవైపు, సెక్స్ రాకెట్తో పాటు ధనవంతులను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా భారీగా కూడబెట్టిన సంపదకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆమెను ఏడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. డిసెంబర్ 13న తిరిగి ఆమెను జిల్లా సెషన్సు కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని విచారించిన ఈడీ.. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఆమె భర్త జగబంధు చంద్ను డిసెంబర్ 7న కోర్టు ముందు హాజరుపరచనుంది. 2018 నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భువనేశ్వర్లోని సత్యవిహార్లో మూడంతస్తుల విశాలమైన బంగ్లాతో పాటు రూ.30కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అర్చనా నాగ్పై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆమెను అక్టోబర్ 6న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..