Archana Nag : నా దగ్గర ఎక్స్క్లూజివ్ సాక్ష్యాలున్నాయ్.. షేక్ చేస్తా : అర్చనా నాగ్
తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా వగ‘లేడీ’ అర్చనా నాగ్(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
భువనేశ్వర్: తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దించి(Honey trap) వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలు, వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన వ్యవహారంలో అరెస్టయిన ఒడిశా మహిళ అర్చనా నాగ్(Archana Nag)ను ఈడీ(ED) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించడానికి ముందు వైద్య పరీక్షల కోసం ఝార్పాడ ప్రత్యేక జైలు నుంచి భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద రాష్ట్రాన్ని షేక్ చేసే విధంగా ఎక్స్క్లూజివ్ సాక్ష్యాలు ఉన్నాయని.. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు చెప్పింది. ఈడీ కస్టడీలో విచారణ కోసమే తాను ఎదురుచూస్తున్నానని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొంది. ‘‘నాకు మాట్లాడటానికి తగినంత సమయం కావాలి. కనీసం 30 నిమిషాలైనా అవసరం. నేను మాట్లాడితే రాష్ట్రంలో మొత్తం సీన్ మారిపోతుంది. నన్ను ట్రాప్లో పడేశారు. ఎక్స్క్లూజివ్ ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టను‘‘ అని వ్యాఖ్యలు చేసింది.
తనను అరెస్టు చేసిన తీరుపైనా ఆమె కమిషనరేట్ ఆఫ్ పోలీసులకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేసింది. తానేమీ ఉగ్రవాదిని కాదని.. కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసిన తీరు, తన కుటుంబాన్ని వేధించిన పద్ధతి చూస్తుంటే ఇదంతా తనపై కుట్రలా ఉందని ఆరోపించింది. మరోవైపు, సెక్స్ రాకెట్తో పాటు ధనవంతులను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా భారీగా కూడబెట్టిన సంపదకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆమెను ఏడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. డిసెంబర్ 13న తిరిగి ఆమెను జిల్లా సెషన్సు కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని విచారించిన ఈడీ.. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఆమె భర్త జగబంధు చంద్ను డిసెంబర్ 7న కోర్టు ముందు హాజరుపరచనుంది. 2018 నుంచి కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భువనేశ్వర్లోని సత్యవిహార్లో మూడంతస్తుల విశాలమైన బంగ్లాతో పాటు రూ.30కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అర్చనా నాగ్పై ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆమెను అక్టోబర్ 6న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.