Kidney Racket: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ వైద్యుడు!
కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు.
కేరళ పోలీసుల దర్యాప్తులో వెల్లడి
ముఠాలో మరో ఇద్దరు దళారులు
వారిని పట్టుకునేందుకు రాజధానికి చేరుకున్న సిట్ బృందం
కేరళ పోలీసులకు పట్టుబడిన సబిత్
ఈనాడు, హైదరాబాద్: కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది. ఈ కేసు ఛేదనకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులను ఇరాన్ తీసుకెళ్లి.. కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్కు సూత్రధారి అయిన వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఓ యువకుడి మృతితో వెలుగులోకి..
బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా.. గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్కు చెందిన వైద్యుడే ప్రధాన కారణం. 2019లో దిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు, సబిత్ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి.. వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు.
డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్కు తరలిస్తున్నారు. ఇరాన్లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజులపాటు దాతను అపార్ట్మెంట్లో ఉంచి.. కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి.. రూ.6 లక్షలు ముట్టజెబుతున్నారు.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు?
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారిగా చెబుతున్న హైదరాబాద్ వైద్యుడి గురించి సబిత్ చెబుతున్న వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా సబిత్కు తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సబిత్ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM