Kidney Racket: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ వైద్యుడు!
కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు.
కేరళ పోలీసుల దర్యాప్తులో వెల్లడి
ముఠాలో మరో ఇద్దరు దళారులు
వారిని పట్టుకునేందుకు రాజధానికి చేరుకున్న సిట్ బృందం
కేరళ పోలీసులకు పట్టుబడిన సబిత్
ఈనాడు, హైదరాబాద్: కేరళలో వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది. ఈ కేసు ఛేదనకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులను ఇరాన్ తీసుకెళ్లి.. కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్కు సూత్రధారి అయిన వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఓ యువకుడి మృతితో వెలుగులోకి..
బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా.. గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్కు చెందిన వైద్యుడే ప్రధాన కారణం. 2019లో దిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు, సబిత్ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి.. వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు.
డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్కు తరలిస్తున్నారు. ఇరాన్లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజులపాటు దాతను అపార్ట్మెంట్లో ఉంచి.. కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి.. రూ.6 లక్షలు ముట్టజెబుతున్నారు.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు?
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారిగా చెబుతున్న హైదరాబాద్ వైద్యుడి గురించి సబిత్ చెబుతున్న వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా సబిత్కు తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సబిత్ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు