రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. కేటీఆర్ విచారం
ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ యువకుడు అక్కడ మోసపోయి ఉక్రెయిన్తో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విషాదం వెలుగులోకి వచ్చింది.
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో హైదరాబాద్కు చెందిన యువకుడు బలైపోయాడు. రష్యా తరఫున పోరాడుతూ మహ్మద్ అఫ్సాన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోవడంతో బలవంతంగా అక్కడి సైన్యంలో చేరాల్సి రావడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అఫ్సాన్ సహా ముగ్గురు హైదరాబాద్ యువకులు ఉద్యోగాల కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయారని.. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ జనవరిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ క్రమంలో రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న 20 నుంచి 30మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించిన కొద్దిరోజుల్లోనే ఈ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.
మరోవైపు, ఈ విషాద ఘటనపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. అఫ్సాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన ఇలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన యువకుల్ని తిరిగి తీసుకొచ్చేలా తగిన సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. మహ్మద్ అఫ్సాన్ మరణవార్త తమకు తెలిసిందని.. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. అఫ్సాన్ భౌతికకాయాన్ని భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం