UP Gangster: నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టొద్దు.. ప్లీజ్ : యూపీ గ్యాంగ్స్టర్ మొర
గుజరాత్లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్ను ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు మరోసారి అతడిని తరలించారు.
లఖ్నవూ: ‘నా పని అయిపోయినట్లే.. కానీ, దయచేసి నా కుటుంబాన్ని మాత్రం ఇబ్బందులకు గురిచేయవద్దు’ అని యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ మొరపెట్టుకున్నాడు. ఓ కేసు విచారణ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసు వ్యానులో నుంచే విలేకర్లతో మాట్లాడాడు. మాఫియాలను మట్టిలో కలిపేస్తామని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన హెచ్చరికలు అతీక్ అహ్మద్ మదిలో మెలగడం వల్లే ఇలా ప్రాధేయపడి ఉండవచ్చని భావిస్తున్నారు.
గుజరాత్లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్ను ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు మరోసారి అతడిని తరలించారు. మార్గమధ్యలో ఉన్న సమయంలో ఓ చోట కాన్వాయ్ ఆగింది. అదే సమయంలో పోలీసు వ్యానులో ఉన్న నిందితుడు కాన్వాయ్ని ఫాలో అవుతున్న మీడియా బృందాన్ని చూశాడు. ‘మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. నాపని అయిపోయింది. కానీ, దయచేసి మా ఇంట్లో మహిళలు, చిన్నారులను మాత్రం ఇబ్బందులకు గురిచేయవద్దు’ అని వేడుకోవడం కనిపించింది. అంతకుముందు కూడా ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తనను బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2019 నుంచి సబర్మతి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిపై సుమారు 100కుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే, ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధానసాక్షిగా ఉన్న ఉమేశ్పాల్ ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను పట్టపగలే కాల్చి చంపడం యూపీలో ఇటీవల సంచలనం సృష్టించింది. అటు ఉమేశ్పాల్ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి కూడా ఇటీవల (మార్చి నెలలో) జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్ అహ్మద్పైనా కేసు నమోదయ్యింది. పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీక్ను కేసు విచారణ సందర్భంగా ప్రయాగ్రాజ్ కోర్టుకు తరలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే