AP News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల సమాచారం చోరీ!
వైకాపా హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన వారిలో కొందరు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమాచార (డేటా) చౌర్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
సెక్రటేరియట్లోని ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు
ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన వారిలో కొందరు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమాచార (డేటా) చౌర్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. సచివాలయాలకు సంబంధించిన గత ఐదేళ్ల సమాచారం దొంగతనానికి గురయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విలువైన డేటాను ఇప్పటికే గుట్టుగా రాష్ట్రం దాటించేశారని అంచనా వేస్తున్నారు. డేటా చౌర్యంపై పోలీసు శాఖలోని ఐటీ విభాగానికి ఫిర్యాదు అందడంతో.. సంబంధిత అధికారులు సచివాలయంలోని ఐటీ శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఐటీ శాఖ పరిధిలోని సర్వర్ నుంచి ఏమైనా డేటా చౌర్యం జరిగిందా? ఏమైనా ఫైళ్లు ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించారా అని ఆరా తీశారు. ఐటీ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలను కూడా పరిశీలించారు. ఉద్యోగుల నుంచి పెన్డ్రైవ్లు, డేటా హార్డ్డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లో ఉన్న సమాచారాన్ని తొలగించడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా అని పరిశీలించారు. సమాచార చౌర్యం విషయాన్ని గుర్తించిన వెంటనే ఐటీశాఖ సచివాలయాల శాఖ వినియోగించే లాగిన్లను నిలిపేయాలని అధికారులను సూచించింది. తమ పర్యవేక్షణలో ఉన్న సర్వర్ను కూడా నిలిపివేసింది.
ముఖ్య ఫైళ్ల ట్యాంపరింగ్కు అవకాశం?
సచివాలయాల సమాచారం దొంగిలించారని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ శాఖలు వినియోగించే ‘ఈ-ఆఫీస్’ లాగిన్లను ఐటీ శాఖ డిజేబుల్ చేసింది. పాత ఫైళ్లలో మార్పులు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని ముందస్తు జాగ్రత్తగా లాగిన్లను నిలిపేసింది. సీఎం పేషీ, మంత్రుల పేషీ, లాగిన్లను కూడా ఐటీ శాఖ డిజేబుల్ చేసింది. గనులు, ఎక్సైజ్, ఆర్థిక శాఖలకు సంబంధించిన కీలకమైన ఫైళ్ల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని భావించి.. లాగిన్లను వెంటనే నిలిపివేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది.
కీలక సమాచారం ‘క్లౌడ్లో’ ఎందుకు ఉంచినట్లు?
ప్రభుత్వ విభాగాలు రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక సేవలను ఐటీ శాఖ నుంచి తీసుకుంటున్నాయి. ఆయా శాఖల సమాచారం మొత్తం ఐటీ శాఖ సర్వర్లలో భద్రంగా ఉంటోంది. కానీ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వం.. ఆ శాఖ ద్వారా అందించే సేవల కోసం సుమారు 90 శాతం సాంకేతికతను క్లౌడ్ విధానంలో తీసుకుంది. వాటికి సంబంధించిన సమాచారం.. ఐటీ శాఖ సర్వర్కు అనుసంధానం కాదు. దీంతో సులువుగా డేటా చౌర్యం చేయడానికి అవకాశం ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?