Robbery: వెబ్సిరీస్ చూసి.. వ్యాపార దంపతులను హత్య చేసి..!
వెబ్సిరీస్ చూసి ఓ ఇంట్లో దోపిడీకి యత్నించిన ఇద్దరు యవకులు.. అక్కడ దంపతులను హత్య చేశారు. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లఖ్నవూ: ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఇద్దరు యువకులు.. ప్రతిఘటించిన దంపతులను హతమార్చారు. అయితే, ఓ వెబ్సిరీస్ చూసి ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు చెప్పడం గమనార్హం. ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపారవేత్త ధన్కుమార్ జైన్(70), ఆయన భార్య అంజు జైన్(65) కుటుంబం మేరఠ్లో నివసిస్తోంది. గురువారం ఇద్దరు యువకులు వారి ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించగా.. దంపతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే నిందితులు వారిపై దాడి చేసి.. డబ్బు, నగలతో పరారయ్యారు. తీవ్ర గాయాలతో ధన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన భార్య మృతి చెందారు.
దర్జాగా బ్యాంకులోకి వచ్చి.. 5 నిమిషాల్లో రూ.14లక్షలు దోచుకుని..!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితులను ప్రియాంక్ శర్మ(25), యశ్ శర్మ(24)ను అరెస్టు చేశారు. ప్రియాంక్.. ఎల్ఎల్బీ చదువుతున్నాడని, యశ్ 8వ తరగతికే చదువు మానేసి, బ్యాటరీల దుకాణంలో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఓ వెబ్సిరీస్ చూసి ఇదంతా చేశామని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూట్యూబ్లో మార్గాలనూ వెతికినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.
‘గుర్తుపట్టకుండా ఉండేలా నిందితులు.. గ్లౌజులు, మాస్కులు, హెల్మెట్ ధరించడంతోపాటు బైక్ నంబర్ ప్లేట్ కూడా మార్చేశారు. సీసీటీవీ కెమెరాలను తప్పించుకునేందుకు యత్నించారు. అయితే, చోరీకి ఒకరోజు ముందు.. అద్దె ఇల్లు పేరిట ఆ నిందితులు ధన్కుమార్ ఇంటికి వెళ్లారు. ఈ ఆధారాలతోపాటు సీసీటీవీ ఫుటేజీలు, ఎలక్ట్రానిక్ నిఘా తదితర సమాచారంతో నిందితులను పట్టుకున్నాం. చోరీ సొత్తుతోపాటు తుపాకీ, బైక్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాం’ అని పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?