Crime news: అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం

బైకుల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 27 May 2024 19:59 IST

నల్గొండ: బైకుల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 67 బైకులు, 5 సెల్‌ఫోన్లు, నకిలీ పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని