Macherla: మాచర్లలో ఆగని వైకాపా ఆగడాలు.. మహిళపై కత్తితో దాడి
పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి.
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. పట్టణంలోని 22వ వార్డులో వైకాపాకి చెందిన ఉప్పుతోళ్ల వెంకేటశ్.. నీలావతి అనే మహిళపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్ ముగిసిన నాటి నుంచి వెంకటేశ్ వీధుల్లో కత్తిపట్టుకొని తిరుగుతూ తెదేపా నాయకులు వార్డులో కనిపిస్తే చంపేస్తానంటూ వీరంగం సృష్టిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో శనివారం సైతం స్థానికులతో గొడవ పడగా.. వారించే ప్రయత్నం చేసిన నీలావతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వైకాపానేత తురక కిషోర్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్పై 10కి పైగా కేసులు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు పీడబ్ల్యూడీ కాలనీ, పాల్వాయి గేటు, ఆ మరుసటి రోజు కారంపూడి అల్లర్లు, దాడుల్లోనూ వెంకటేష్ పాల్గొన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
సైబర్ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. -
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
శంషాబాద్లో ఎక్సైజ్ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. -
గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం.. బాండ్లపై సంతకాలు పెట్టించుకొని వదిలేశారు
నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఎస్వోటీ పోలీసులమంటూ ఓ కంపెనీ ఎండీతోపాటు సేల్స్ కోఆర్డినేటర్ను దుండగులు కిడ్నాప్ చేశారు. -
గంగానదిలో పడవ మునక.. ఆరుగురు గల్లంతు
గంగా నదిలో పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. -
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్