Odisha: బ్రిడ్జిపై నుంచి కింద పడిన బస్సు.. ఐదుగురు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై నుంచి బస్సు కింద పడి ఐదుగురు మృతి చెందారు. 40 మందికి గాయాలు అయ్యాయి. 

Published : 16 Apr 2024 00:04 IST

జజ్‌పుర్‌: ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జజ్‌పుర్‌ జిల్లాలోని జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. 40 మందికి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 30 మంది క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బస్సు పూరి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని