Kota: ఐదేళ్ల బాలికపై ఉపాధ్యాయుడి కర్కశత్వం

ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో ఐదేళ్ల విద్యార్థి చేతి ఎముక విరిగిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది.    

Published : 25 Feb 2024 18:43 IST

కోటా: ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో ఐదేళ్ల విద్యార్థి చేతి ఎముక విరిగిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖేదరాసుల్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలికను ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా చిన్నారి చేతిని బలంగా లాగి కొట్టడంతో బాలిక చేతి ఎముక విరిగింది. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్‌ సత్తార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆదివారం కోర్టు ముందు హాజరు పరుస్తామని సర్కిల్‌ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని