Peddapalli: విషాదం.. గుండెపోటుతో అన్న మృతి.. మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందిన అన్న మృతదేహానికి సోదరి రాఖీ కట్టింది. 

Updated : 30 Aug 2023 13:14 IST

ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందిన అన్న మృతదేహానికి సోదరి రాఖీ కట్టింది. మండలంలోని ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్య అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన అతడి సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న సోదరుడు ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. తీవ్ర దుఃఖంతోనే కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. సోదరి అనురాగాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని