Crime News: ఆస్తి కోసం అత్తమామలపై కాల్పులు

ఆస్తి కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కాల్పులు జరిపిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాంలో చోటు చేసుకుంది.

Published : 28 Feb 2024 16:26 IST

కన్నెపల్లి: ఆస్తి కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కాల్పులు జరిపాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తి రాసివ్వాలంటూ గోలేటి శంకర్‌, లక్ష్మి దంపతులను వారి పెద్ద అల్లుడు నరేందర్‌ గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో బుల్లెట్‌ గోడకి తగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని